Moviesలైగ‌ర్ డిజాస్ట‌ర్ అయినా విజ‌య్ - స‌మంత‌ టార్గెట్ పెద్ద‌దే… '...

లైగ‌ర్ డిజాస్ట‌ర్ అయినా విజ‌య్ – స‌మంత‌ టార్గెట్ పెద్ద‌దే… ‘ ఖుషి ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత ఏడాది లైగ‌ర్ లాంటి డిజాస్టర్ సినిమాతో తన అభిమానులను బాగా నిరాశపరిచాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన లైగర్ విజయ్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ అవడంతో పాటు భారీ స్థాయిలో నష్టాలు మిగిలింది. దీంతో విజయ్ సక్సెస్ రేట్ కూడా ఒక్కసారిగా కిందకు నెట్టేసింది.

ఇక లైగ‌ర్ తర్వాత ప్రస్తుతం ఖుషి సినిమాతో కం బ్యాక్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు. సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు క్లాసిక్ సినిమాల‌ దర్శకుడుగా పేరు ఉన్న శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాకు మంచి హైప్‌ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమాకు మంచి బిజినెస్ కూడా జరిగింది.

ఆంధ్ర ఏరియాలో రు. 20 కోట్ల రేంజ్ లో ఖుషి సినిమాకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. సిడెడ్‌ ఏరియాలో ఆరు కోట్ల రేంజ్ లో ధర పలికిన ఖుషి.. నైజాంలో రు. 15 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. రెస్ట్ ఆఫ్ ఇండియాలో రు. 3.5 కోట్లు – ఓవర్సీస్‌లో రు. 8.5 కోట్ల ధర పలికిన ఖుషి ప్రపంచ వ్యాప్తంగా రు. 52 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వాలి అంటే రు. 53 కోట్ల షేర్ అందుకోవాలి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ రు. 20 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. దర్శకుడు శివ ఖుషి సినిమాను ప్యూర్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు క్లియర్ గా తెలుస్తోంది. టీజర్ – ట్రైలర్ – సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ క్రియేట్ చేశాయి. మరి ఈ భారీ టార్గెట్ విజయ్ – సమంత ఛేదిస్తారో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news