Moviesమెగా షాక్‌: భోళాశంక‌ర్ రిలీజ్‌కు బిగ్ బ్రేక్‌...?

మెగా షాక్‌: భోళాశంక‌ర్ రిలీజ్‌కు బిగ్ బ్రేక్‌…?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తర్కెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భోళాశంకర్. ఈ సినిమా ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. కోలీవుడ్లో అజిత్ హీరోగా తెరకెక్కిన వేదాళం సినిమాకు రీమిక్ గా భోళాశంకర్ తెరకెక్కింది. అయితే ఈ సినిమా రిలీజ్ కు టైం దగ్గర పడుతుండడంతో అనుకొని షాక్ తగిలింది. ఈ సినిమా రిలీజ్ ఆపేయాలంటూ వైజాగ్ కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గాయత్రి ఫిలిమ్స్ అధినేత గాయత్రి సతీష్ కోర్టులో కేసు వేశారు.

భోళాశంకర్ సినిమా నిర్మాత అనిల్ సుంకర అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణ – కర్ణాటక హక్కులు ఐదు సంవత్సరాల పాటు గాయత్రి సతీష్ కు ఇస్తూ రు. 30 కోట్లకు డీల్ కుదిరింది. ఈ క్రమంలోనే గాయత్రి సతీష్ రు. 30 కోట్లు అనిల్ సుంకర కు చెల్లించారు. అయితే రిలీజ్ టైం లో కేవలం వైజాగ్ పంపిణీ హక్కుల మాత్రమే ఇచ్చారని ఆరోపిస్తూ ఈరోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

నిర్మాతలు తనకు 20 కోట్ల రూపాయలు చెల్లిస్తానని హామీ ఇచ్చారని.. ఈ హామీలు ఇంకా నెరవేరలేదని ఈ క్రమంలోనే భోళాశంకర్ సినిమా రిలీజ్ ను తాత్కాలికంగా వాయిదా వేసేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈరోజు కోర్టు వారి వాదనను విన్న తర్వాత తదుపరి చర్యలు తీసుకోనుంది. ఇప్పటివరకు మనీ రాకపోవడం తోనే ప్రెస్ నోట్ రిలీజ్ చేశాన‌ని స‌తీష్ చెపుతున్నారు. కోర్టు తీర్పు సానుకూలంగా రాక‌పోతే భోళాశంక‌ర్ రిలీజ్ డైల‌మాలో ప‌డిన‌ట్టే అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news