Newsవిజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కు స‌మంత ఘాటు వార్నింగ్‌.. మీ ప‌ని మీరు...

విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కు స‌మంత ఘాటు వార్నింగ్‌.. మీ ప‌ని మీరు చూసుకోండి…!

విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన సినిమా ఖుషి. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో నటించిన సమంత పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆమె కూడా ఒప్పుకుంది. ఖుషి తర్వాత కొద్ది రోజులపాటు ఆమె సినిమాలకు దూరంగా ఉంటానని హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక ఖుషి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీబిజీగా ఉంది. ఖుషి సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కూడా జరిగింది. ఈ వేడుకకు సమంత రాలేదు. దీంతో సమంతపై కొందరు విజ‌య్‌ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై స్పందించిన సమంత తనదైన స్టైల్ లో విజయ ఫ్యాన్స్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

మీకోసం మీరు బతకండి.. ఈ లోకం కోసం సమాజం కోసం బ్రతకాల్సిన పనిలేదు.. మీ గౌరవం ఏమిటో ? తెలుసుకోండి.. మీ స్థాయిని పెంచుకోండి.. మిమ్మల్ని సమాజం గుర్తించకపోవచ్చు.. అది ఎంత అవసరం లేదు.. పదిమందిలో ఒకరిలా కాకుండా యూనిక్‌గా జీవించండి.. ఈ సమాజంలో ఏం చేసినా విమర్శించేవాళ్లు విమర్శలు చేస్తూనే ఉంటారు.. వాళ్లకోసం మనం బ్రతకాల్సిన అవసరం లేదు.. మన జీవనశైలి మార్చుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఒక నోట్ షేర్ చేసింది.

ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సమంత ఇంత సుదీర్ఘంగా చేసిన ఈ కామెంట్ తనను టార్గెట్ చేస్తూ విజయ్ దేవరకొండ అభిమానులు చేస్తున్న కామెంట్లకు కౌంటర్ గానే ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తోంది. మామూలుగానే విజయ్ అభిమానులు ఎవరిని వదిలిపెట్టరు. హాట్ యాంక‌ర్‌ అనసూయ విషయంలో ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేశారు. మరి ఇప్పుడు సమంత తమను టార్గెట్ చేయడంతో దీనికి ఎలాంటి రీకౌంటర్లు ఇస్తారు అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news