Newsప‌వ‌న్ క‌ళ్యాణ్ VS ఎన్టీఆర్... టాలీవుడ్‌లో ఫ‌స్ట్ టైం ఫ్యాన్స్ ర‌చ్చ‌..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ VS ఎన్టీఆర్… టాలీవుడ్‌లో ఫ‌స్ట్ టైం ఫ్యాన్స్ ర‌చ్చ‌..!

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎప్పుడు ఒకే టైంలో రిలీజ్ కాలేదు. ఈ ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ అయినా కూడా హీరోల అభిమానుల మధ్య మాత్రం ఎప్పుడు ఆ వాతావరణం అయితే లేదు. అయితే చాలా యేళ్ల తర్వాత ఈ ఇద్దరు హీరోలు నటిస్తున్న రెండు ప్రతిష్టాత్మక సినిమాలు ఒకే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీంతో టాలీవుడ్ లో మునుపెన్నడు లేని పెద్ద బాక్సాఫీస్ యుద్ధాన్ని చూడబోతున్నాం.

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర లాంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే షూటింగ్ శ‌రవేగంగా నడుస్తుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.

క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు – సుజిత్ దర్శకత్వంలో ఓజి సినిమాలతో పాటు హరీష్‌ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఈ మూడు సినిమాలలో ఓజీ సినిమాను ముందుగా క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే పవన్ అటు రాజకీయాల్లో బిజీగా ఉండడంతో డేట్లు ఆలస్యంగా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఓజి సినిమాను కూడా వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్ మొదటి వారంలోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర దిగితే కచ్చితంగా బిగ్ క్లాస్ తప్పదు. ఇద్దరు హీరోల అభిమానుల కామెంట్ల‌తో సోషల్ మీడియా వేడెక్కిపోతుంది. టాలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా రేంజ్ లో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ను షేక్‌ చేయడం ఖాయం. అదే టైంలో ఇద్దరు హీరోల అభిమానులు ఎక్కడా వెనక్కు తగ్గకుండా ర్యాంపేజ్ ఆడుకుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news