Movies"ఆమె ముందు ప్యాంట్ తీయ్యాలంటే భయం వేసింది"..సాయి పల్లవి ఫ్యాన్స్ కలలో...

“ఆమె ముందు ప్యాంట్ తీయ్యాలంటే భయం వేసింది”..సాయి పల్లవి ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు.. కానీ సాయి పల్లవి అని చెప్పగానే అందరికీ తెలియని గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇండస్ట్రీలో ఒకప్పుడు మహానటి సావిత్రి పేరు చెప్తే ఇలాంటి ఫీలింగ్ కలిగేది అంటూ ఆమె ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. దానికి కారణం ఎక్స్పోజింగ్. ఇలా తనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంది కాబట్టే సాయి పల్లవి స్టార్ హీరోయిన్గా మారింది అని ..లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. కాగా ఇదే విషయాన్ని మరోసారి కన్ఫామ్ చేశాడు బాలీవుడ్ స్టార్ విలన్ మనిష్ వాధ్వ.

ఈ పేరు చెప్తే జనాలకి గుర్తు పడడం కొంచెం కష్టమే కానీ శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవిని ఏడించిన విలన్ అని చెప్తే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు. ఆయన తెలుగులో పలు సినిమాలో నటించి క్రేజ్ సంపాదించుకున్నాడు . ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన గద్దర్ 2 లో కూడా నటించాడు . ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది.

అంతకుముందు షారుక్ ఖాన్ నటించిన పథాన్ సినిమాలోను ఆయన నటించి మెప్పించాడు . రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించిన ఓ సీన్ ని గుర్తు చేసుకున్నాడు. నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా కృతి శెట్టి మరో హీరోయిన్గా నటించిన సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాలో సాయి పల్లవి దేవిదాసి పాత్రలో కనిపించింది . అయితే ఎంతోమంది నటులను గజగజ వణికించే మనీష్ వాధ్వ.. సాయి పల్లవిని చూసి వణికిపోయాడట . శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఆయన గురువుగా నటించారు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఆయన సాయి పల్లవిని తీవ్రంగా కొట్టి ఆ తర్వాత ఆమెపై మూత్ర విసర్జన చేసే సన్నివేశం ఉంటుంది . అయితే ఆ సీన్ చేయాలంటే చాలా భయపడిపోయానని ఆమె ముందు అలాంటి సీన్ చేయడం నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది అని చెప్పుకొచ్చారు”. ఇవే కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

Latest news