Moviesభోళాశంక‌ర్ సినిమా తేడా కొడితే మ‌హేష్ బ‌లైపోయిన‌ట్టే...!

భోళాశంక‌ర్ సినిమా తేడా కొడితే మ‌హేష్ బ‌లైపోయిన‌ట్టే…!

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాపై మెగా అభిమానులు చిరంజీవి వీర‌ అభిమానుల్లోనే చాలా సందేహాలు ఉన్నాయి. డైరెక్టర్ మెహర్ రమేష్ పేరు చెబితేనే శక్తి – షాడో – కంత్రి లాంటి డిజాస్టర్ సినిమాలు ప్రతి ఒక్కరి కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. అసలు మెహర్ రమేష్ చివరిసారిగా వెంకటేష్‌తో షాడో సినిమా చేసి కూడా 10 సంవత్సరాలు అవుతోంది.

పైగా భోళాశంకర్ తమిళంలో ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. వేదాళం సినిమాయే పరమ ఊర‌ మాస్ రాడ్ సినిమా ఇప్పటికే యూట్యూబ్లో చాలామంది ఈ సినిమాను చూసేశారు. అలాంటిది ఈ సినిమాను రీమేక్ చేయటం.. అందులోనూ మెహర్ రమేష్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై మెగా అభిమానులకే నమ్మకాలు లేవు.

విచిత్రం ఏంటంటే ఈ సినిమా చిరంజీవికి అయితే బాగుంటుందని మహేష్ బాబు సజెషన్ చేశారట. అనిల్ సుంకర మహేష్ బాబుతో నిర్మించిన సరిలేరు నీకెవ్వరు సినిమా గుంటూరు రైట్స్ మెహర్ రమేష్ పంపిణీ చేశారట. ఈ సమయంలోనే మహేష్ రమేష్, అనిల్ సుంకర కలిసి చర్చించుకునే వారట. అప్పుడే వేదాళం రీమిక్స్ ప్రస్తావన రాగా ఇది చిరంజీవి గారికి బాగా సూట్ అవుతుందని మహేష్ చెప్పారట.

రేపు సినిమా సూపర్ హిట్ అయితే మహేష్ బాబు సలహా బాగా వర్కౌట్ అయిందన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టిన చిరంజీవి అభిమానులు మెహర్ రమేష్ తో పాటు మహేష్ బాబును కూడా ఆటాడుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news