Moviesమరోసారి ఆ లక్కి బ్యూటీతో వన్స్ మోర్ అంటున్న బాలయ్య.. అభిమానులకు...

మరోసారి ఆ లక్కి బ్యూటీతో వన్స్ మోర్ అంటున్న బాలయ్య.. అభిమానులకు మంచి కిక్కిచే అప్డేట్..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని కాంబోలు భలే సెట్ అవుతూ ఉంటాయి. వన్స్ ఆ కాంబో సెట్ అయ్యి అభిమానులకు నచ్చేస్తే .. ఆ తర్వాత కాంబో ని క్రేజీ కపుల్ గా మార్చేస్తూ.. స్టార్ హీరో హీరోయిన్లుగా మారి రాజ్యమేలుస్తూ ఉంటారు . ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటాడు నయనతార – బాలకృష్ణ . సినిమా ఇండస్ట్రీలో నయనతార – బాలకృష్ణకు ఉండే క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అంతేకాదు వీళ్లు కలిసి నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో.. అభిమానులు వీళ్ళ కాంబో ని మరోసారి తెరపై చూడాలి అంటూ ఆశపడుతున్నారు .

ఇప్పటికే సింహ. శ్రీ రామ రాజ్యం . జై సింహా లాంటి సినిమాలలో ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అయి అభిమానులని అల్లరించిన విషయం తెలిసిందే . కాగ తాజాగా మరోసారి బాలయ్య నయనతారల సినిమా ఫైనలైజ్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మనకు తెలిసిందే కుర్ర హీరోల కన్నా జెట్ స్పీడ్ లో సినిమాలను సైన్ చేస్తూ దూసుకుపోతున్న బాలయ్య.. తన 108వ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు .

రీసెంట్ గానే భగవంత్ కేసరి అనే టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే బాలయ్య తన 109వ సినిమాను సైతం ప్రారంభించారు . మెగా డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న బాబి డైరెక్షన్లో బాలయ్య మరో సినిమాను స్టార్ట్ చేశారు . ఈ సినిమా ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది . అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా నయనతారను తీసుకోబోతున్నట్లు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . నిజానికి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని ..మొదటి హీరోయిన్గా నయనతారను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. దీంతో ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్గా మారింది . చూడాలి మరి ఈ క్రేజీ కాంబో రిపీట్ అయితే ఎలా ఉంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news