Moviesబాక్స్ ఆఫిస్ వద్ద "ఆది పురుష్" బ్లాస్టింగ్ కలెక్షన్స్.. విమర్శలు ఎన్ని...

బాక్స్ ఆఫిస్ వద్ద “ఆది పురుష్” బ్లాస్టింగ్ కలెక్షన్స్.. విమర్శలు ఎన్ని వచ్చినా తగ్గేదే లే.. మొత్తం ఎన్ని వందల కోట్లు అంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన సినిమా ఆది పురుష్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మూడు రోజుల్లోనే 350 కోట్లు కలెక్ట్ చేసి సినిమా ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసిన ఆది పురుష్.. ఓవైపు నెగటివ్ టాక్ దక్కించుకున్న సరే కలెక్షన్స్ పరంగా పాజిటివ్ గా ముందుకు వెళ్తుంది.

కాగా రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాముడు పాత్రలో ప్రభాస్ నటించగా.. సీత పాత్రలో కృతి సనన్ నటించింది. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు డైలాగ్స్ పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి . సినిమా డైరెక్టర్ రైటర్ ను బూతులు తిట్టారు . అయినా సరే కలెక్షన్స్ పరంగా ఏ మాత్రం తగ్గేదేలే అన్న రేంజ్ లో దూసుకుపోతుంది ఆది పురుష్.

మొదటి మూడు రోజుల్లోనే 340 కోట్ల కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆది పురుష్ ఫస్ట్ వీక్ డేస్ కావడంతో మెల్లిగా కలెక్షన్స్ తగ్గుముఖం పడ్డాయి . అయితే మొత్తంగా ఆరు రోజులు కలెక్షన్స్ 410 కోట్లు గ్రాస్కలెక్ట్ చేసినట్లు చిత్రం బృందం అధికారికంగా ప్రకటించింది . అంటే దాదాపు 200 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది . ఈ వీకెండ్ వరకు పెద్దగా సినిమాలు ఏమీ లేకపోవడంతో కచ్చితంగా 600 కోట్లు దాటేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు ట్రేడ్ వర్గాలు . చూడాలి మరి ప్రభాస్ సినిమా మరెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news