Movies1st Wedding Anniversary Special: అభిమానులకి నయన్-విగ్నేశ్ మరో గుడ్ న్యూస్.....

1st Wedding Anniversary Special: అభిమానులకి నయన్-విగ్నేశ్ మరో గుడ్ న్యూస్.. ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!

సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార – కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . 2022 జూన్ 9న గ్రాండ్గా నయనతార -విగ్నేశ్ శివన్ ల పెళ్లి జరిగింది. అప్పట్లో వీళ్ళ పెళ్లి తమిళనాడు లోని మహాబలిపురం దగ్గర ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్ళి అయిన నాలుగు నెలలకే ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులై సినీ ఇండస్ట్రీని ..సోషల్ మీడియాని షేక్ చేసిన నయనతార – విగ్నేశ్.

ఆ తర్వాత వాళ్ళు సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారన్న విషయం మనందరికీ బాగా తెలుసు. రీసెంట్గా నయనతార అభిమానులకి తన ఇద్దరు పిల్లలు ముఖాలను రివిల్ చేసింది . ఇన్నాళ్ళకి పిల్లల ముఖాలు చూపించడంతో నయన్ ఫాన్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నారు. మనకు తెలిసిందే నయనతార తల్లి అయింది అని తెలిసిన మరుక్షణం నుంచి సోషల్ మీడియాలో ఆమెను జనాలు ఏకిపారేశారు. నానా రచ్చ రాద్ధాంతాలతో ఆమెను టార్చర్ చేశారు .

అయితే ఫైనల్లీ నయనతార మొదటి పెళ్లి రోజు సందర్భంగా తన కొడుకుల ముఖాలను రివిల్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో నయనతార విగ్నేశ్ శివన్ క్యూట్ బేబీస్ ఫోటోస్ వైరల్ గా మారాయి . అప్పుడే వీరు ఇద్దరి పిల్లల్కి ఉయిర్-ఉల్గం అంటూ పేర్లు పెట్టేశారు. అంతేకాదు ఇద్దరికీ ఒకరికొకరు నయనతార విగ్నేశ్ శివన్ ఎంతో ప్రేమగా పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దీంతో నయనతార తన అభిమానులకి పెళ్లిరోజు సందర్భంగా తన ప్రాణానికి ప్రాణమైన కొడుకుల ఫోటోలు రిలీజ్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news