Moviesచిరంజీవి "భోళా శంకర్" సినిమా స్టోరీ చెప్పగానే .. కోపంతో లేచి...

చిరంజీవి “భోళా శంకర్” సినిమా స్టోరీ చెప్పగానే .. కోపంతో లేచి వెళ్లిపోయిన తెలుగు హీరో..ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమా “భోళా శంకర్”. ప్రజెంట్ ఫారిన్ కంట్రీస్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతోంది . ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా కనిపించబోతూ ఉండగా.. హీరోయిన్గా తమన్నా నటించబోతుంది. ఈ సినిమాలో యాంకర్ శ్రీముఖి కూడా ఓ కీలకపాత్రలో నటించబోతుందని ..సినిమాలో శ్రీముఖి – చిరంజీవి ల మధ్య వచ్చే నడుము సీన్ సినిమాకి హైలెట్ గా ఉండబోతుందని ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అయితే మెహర్ రమేష్ ఈ సినిమా కథను ముందుగా చిరంజీవి కంటే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబుకు వివరించారట. మహేష్ బాబు – మెహర్ రమేష్ ఎంత జాన్ జిగిడి దోస్తులనే సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే గత కొన్ని సంవత్సరాలుగా మెహర్ రమేష్-మహేష్ బాబుకు ఏదో ఒక కథ చెబుతూ ఉండడం.. అది నచ్చకుండా స్క్రిప్ట్ మారుస్తూ ఉండమని మహేష్ బాబు చెప్తుండడం కామన్ గా జరుగుతుంది.

ఎలాగైనా సరే భోళాశంకర్ సినిమాతో మహేష్ బాబుతో సినిమా తెరకెక్కించాలని ఆశపడిన మెహర్ రమేష్ కు నిరాశ మిగిలింది .భోలాశంకర్ వన్ పేజీ స్క్రిప్ చెప్పగానే మహేష్ బాబు కోపంతో లేచి వెళ్లిపోయాడట . “నా బాడీకి నా ఫిజిక్కి ఎలాంటి స్టోరీ చెప్తున్నావు.. మెహర్ రమేష్ ” అంటూ మండిపడ్డారట . అయితే సెకండ్ పేజీ చదవకుండానే మహేష్ బాబు ఈ స్క్రిప్ ను రిజెక్ట్ చేసేసాడు. దీంతో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి చిరంజీవికి వివరించారు. స్క్రిప్ట్ నచ్చిన చిరంజీవి కమిట్ అయ్యారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా హిట్ అయితే మెహర్ రమేష్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news