Moviesనీహారిక కి కొత్త లైఫ్ ఇస్తున్న సాయి ధరమ్ తేజ్.. మెగా...

నీహారిక కి కొత్త లైఫ్ ఇస్తున్న సాయి ధరమ్ తేజ్.. మెగా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారిక పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కోట్లు ఖర్చు చేసి జొన్నలగడ్డ చైతన్య ను పెళ్లి చేసుకున్న నిహారిక త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అన్న న్యూస్ ప్రజెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దానికి కారణం వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొక అన్ ఫాలో చేసుకోవడం .. పైగా పెళ్లికి సంబంధించిన పిక్స్ డిలీట్ చేయడమే అంటూ తెలుస్తుంది .

అయితే ఇలాంటివి పెద్దగా పట్టించుకోని నిహారిక సినిమా ఇండస్ట్రీ లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ లో నటించింది . “డెడ్ పిక్సెల్స్ ” అనే ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది . సిరీస్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా పాల్గొంటున్న నిహారిక .. వెబ్ సిరీస్ కు తనదైన స్టైల్ లో ప్రమోట్ చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 16న హైదరాబాద్లోని దశపల్ల హోటల్లో గ్రాండ్గా జరగబోతుంది.

ఈ క్రమంలోని ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ రాబోతున్నాడు అంటూ ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దీన్ని అఫీషియల్ గా కూడా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. నటిగా వెబ్ సిరీస్తో మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్న నిహారిక కు తనదైన బూస్టప్ ఇవ్వాలని సాయిధరమ్ తేజ్ ఎంకరేజ్ చేయడానికి ఈవెంట్ కి రావడానికి ఒప్పుకున్నారట. సిరీస్ కింగ్డమ్ స్కూల్స్ అనే వీడియో గేమ్తో నిమగ్నమైన ముగ్గురు స్నేహితుల జీవితాల ఆధారంగా తెరకెక్కినట్లు వైరల్ అవుతుంది , నిహారిక కు కొత్త లైఫ్ ఇవ్వడానికి బావ సాయి ఇలాంటి ని తీసుకున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. చూద్దాం వెబ్ సిరీస్ ద్వార నీహారిక ని యాక్సెప్ట్ చేస్తారో లేదో జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news