Moviesఆ సినిమా చూస్తూ భోరున ఏడ్చేసిన కృతిశెట్టి… అంత ఏడిపించిన సినిమా...

ఆ సినిమా చూస్తూ భోరున ఏడ్చేసిన కృతిశెట్టి… అంత ఏడిపించిన సినిమా ఇదే…!

టాలీవుడ్‌లో త‌ళుక్కున మెరిసిన ముద్దుగుమ్మ కృతిశెట్టి. క‌న్న‌డ ముద్దుగుమ్మ అయిన కృతి ఉప్పెన సినిమాతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆమె వ‌రుస‌గా కుర్ర హీరోల‌కు జోడీగా న‌టిస్తున్నా అవేవి స‌క్సెస్ కావ‌డం లేదు. వ‌రుస ప్లాపుల త‌ర్వాత అక్కినేని హీరోలు న‌టించిన బంగార్రాజు సినిమా మాత్ర‌మే ఆమెకు కాస్త ఊర‌ట ఇచ్చింది.

ఇక తాజాగా ఆమె మ‌ళ్లీ అక్కినేని హీరో నాగ‌చైత‌న్య న‌టించిన క‌స్ట‌డీ సినిమాతో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంటోన్న ఆమె చాలా ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు షేర్ చేస్తున్నారు. ఆమె ఓ సినిమా చూసి బాగా ఎమోష‌న‌ల్ అయిపోయి ఏడ్చేసింద‌ట‌. ఆ సినిమా త‌న‌ను అంత‌గా హ‌త్తుకుంద‌ని చెపుతోంది. ఆ సినిమా ఏదో కాదు బంగార్రాజు.

దీనికి ఓ కారణం కూడా ఉందని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ‌. బంగార్రాజు సినిమాతో తాను చాలా బాగా క‌నెక్ట్ అయ్యాన‌ని.. ఆ సినిమా చూసిన వెంట‌నే ద‌ర్శ‌కుడు కల్యాణ్ కృష్ణకు ఫోన్ చేసి… ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండానే ఏడ్చేశాన‌ని.. ఆ సినిమాకు తాను అంత‌లా క‌నెక్ట్ అయిపోయాన‌ని చెప్పింది.

బంగార్రాజు సినిమా మా ట్రెడిష‌న్‌.. మా శెట్టి కుటుంబాల్లోనూ ఓ న‌మ్మ‌కం ఉంటుంది.. మా పెద్దోళ్లు ఆత్మ‌ల రూపంలో మా చుట్టూ తిరుగుతూ ఉంటారు.. మమ్మ‌ల‌ను కాపాడుతూ ఉంటార‌న్న న‌మ్మ‌కం ఉంటుంది.. వాళ్ల‌కు పూజ‌లు కూడా చేస్తాం.. బంగార్రాజు సినిమా చూసిన‌ప్పుడు కూడా నాకు మా ప‌ర్వీకులు, ఆ సంప్ర‌దాయాలు గుర్తుకు రావ‌డంతో నేను ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయిపోయాన‌ని అందుకే ఏడ్చేశానంటూ చెప్పుకొచ్చింది.

ఇలా త‌న ఏడుపు వెన‌క కార‌ణం బ‌య‌ట పెట్టింది కృతి. అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమా చూసినప్పుడు కూడా ఏడ్చేశాన‌ని.. ఈ రెండు సినిమాలు మాత్ర‌మే త‌నకు క‌న్నీళ్లు తెప్పించాయ‌ని చెపుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news