Moviesశర్వానంద్ మొదటి పెళ్లి పత్రిక ఎవ్వరికి ఇచ్చాడో తెలుసా..? మోస్ట్ మోస్ట్...

శర్వానంద్ మొదటి పెళ్లి పత్రిక ఎవ్వరికి ఇచ్చాడో తెలుసా..? మోస్ట్ మోస్ట్ స్పెషల్ పర్సన్..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. జనవరిలో రక్షిత రెడ్డిని గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్.. ఆ తర్వాత పెళ్లి ఊసే ఎత్తలేదు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నానా రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. మరికొందరు ఏకంగా వాళ్ళ పెళ్లి ఆగిపోయింది అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు . ఈ బాధలు తట్టుకోలేక రీసెంట్గా శర్వానంద్ అభిమానులకి క్లారిటీ ఇవ్వాలనుకున్నారు . ఈ క్రమంలోనే ఆయన పిఆర్ టీం నుంచి అఫీషియల్ నోట్ వచ్చింది . త్వరలోనే శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నారని .. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు తెలియజేస్తారని చెప్పుకొచ్చారు.

వాళ్ళు చెప్పిన రెండు రోజులకే సోషల్ మీడియాలో జూన్ మూడవ తేదీ శర్వానంద్ పెళ్లి జరగబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అయింది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం .. ఆయన పెళ్లికి సంబంధించిన అన్ని పనులు పూర్తి అయిపోయాయట . అంతేకాదు శర్వా-రక్షితల పెళ్లి జైపూర్లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు మారుమ్రోగిపోతున్నాయి . అంతేకాదు ఈ పెళ్లి రెండు రోజులపాటు జరగనుందని తెలుస్తుంది. ప్రీ వెడ్డింగ్ ని శర్వానంద్ – రక్షిత రెడ్డి మరింత గ్రాండ్ గా ప్లాన్ చేశారట . అంతేకాదు ఈ పెళ్లికి చాలా దగ్గర ఉంది స్నేహితుల కుటుంబ సభ్యులు మాత్రమే ఆహ్వానించారని వార్తలు వినిపిస్తున్నాయి.

పెళ్లి జరిగాక హైదరాబాదులో గ్రాండ్గా రిసెప్షన్ ఇస్తారట శర్వానంద్ – రక్షిత రెడ్డి . కాగా శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే లీలా ప్యాలెస్ ఒకరోజు రెంట్ ఎన్ని కోట్ల రూపాయలు తెలిస్తే గుండె ఆగిపోతుంది . జైపూర్ లోని లీలా ప్యాలెస్ అతి ఖరీదట. అందుతున్న సమాచారం ప్రకారం ఒక రోజుకి ఐదు కోట్ల వరకు దీనికి రెంట్ ఉంటుందట . ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . శర్వానంద్ దీని కోసం మొత్తంగా 30 రోజులు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు శర్వానంద్ తన మొదటి పెళ్లి పత్రికను ఎంతో ఇష్టమైన మెగా ఫ్యామిలీకి ఇచ్చారట . మనకు తెలిసిందే చిరంజీవి అంటే శర్వానంద్ కి ప్రాణం. ఈ విషయాన్ని ఎన్నో సార్లు ఓపెన్ గానే చెప్పుకొచ్చారు . రామ్ చరణ్ – శర్వానంద్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

కాగా ఈ క్రమంలోనే తన నుండి మొదటి పత్రిక మెగాస్టార్ చిరంజీవి కి ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నారట. దీంతో చిరంజీవి అంటే శర్వానంద్ కు ఎంత ఇష్టమో మరోసారి ప్రూవ్ అయింది . ఏది ఏమైనా సరే శర్వానంద్ రక్షిత రెడ్డి జంట చూడ చక్కగా ఉంది . ఈ జంట ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ బ్లెస్ చేస్తున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news