Moviesఅమ్మ బాధ త‌ట్టుకోలేక‌… గుండెలు పిండేస్తోన్న తార‌క‌ర‌త్న కూతురు నిషిక మాట‌లు…...

అమ్మ బాధ త‌ట్టుకోలేక‌… గుండెలు పిండేస్తోన్న తార‌క‌ర‌త్న కూతురు నిషిక మాట‌లు… !

నందమూరి వారసుడు తారకరత్న హఠాన్మరణం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి వేస్తుంది. తారకరత్న మృతి చెంది 15 రోజులు దాటుతున్న ఇప్పటికీ ఆ మరణం నుంచి నందమూరి కుటుంబం కోలుకోలేదు. ముఖ్యంగా తారకరత్న లేని లోటు భార్య అలేఖ్య రెడ్డితో పాటు కుమార్తె నిషిక‌కు ఎవరు తీర్చలేనిది.
తారకరత్న మృతి చెందినప్పుడు అలేఖ్య – నిషిక‌ బాధపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో చూసాం.

తార‌క‌ర‌త్న మృత‌దేహం అక్క‌డ ఉండ‌గానే ప‌రిగెత్తు కుంటూ వెళ్లి విజ‌య‌సాయితో మాట్లాడుతున్న చిన‌తాత బాల‌య్య‌ను వాటేసుకున్న వీడియో ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాన్ని ఎంతో క‌లిచి వేసింది. తాజాగా తన తండ్రి మరణ వేదన నేపథ్యంలో కుమార్తె నిషిక‌ ఎమోషనల్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భర్త తారకరత్న చనిపోయిన బాధ నుంచి కోలుకోలేక అలేఖ్య రెడ్డి ఇప్పటికీ బాధపడుతుండడంతో నిషిక‌ ఈ పోస్ట్ పెట్టినట్టు స్పష్టమవుతుంది.

నిషిక తన పోస్టులో అమ్మా నువ్వు ఇంకా చాలా బాధ‌లో ఉన్నావు.. నువ్వు మ‌రోసారి ఏడిస్తే నేను గుడ్ బై చెపుతా అంటూ పెట్టింది. నిషిక త‌న త‌ల్లి ఆవేద‌న‌, బాధ అర్థం చేసుకోవ‌డంతో పాటు త‌న త‌ల్లి బాధ‌ప‌డుతుంటే తాను చూస్తూ త‌ట్టుకోలేన‌ని త‌న పోస్టు ద్వారా వ్య‌క్త ప‌రిచింది. నిషిక మాట‌ల్లో మీనింగ్ అర్థం చేసుకున్న నెటిజ‌న్లు ఇప్పుడు ఆమెకు మ‌నోధైర్యం కావాల‌ని.. అలేఖ్య రెడ్డి ధైర్యంగా ఉండడంతో పాటు త‌న పిల్ల‌ల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని చెపుతున్నారు.

ఇక ఈ కుటుంబానికి కొంత కాలం పాటు నంద‌మూరి ఫ్యామిలీ అండ‌దండ‌లు కూడా ఉండాలి. ఇప్ప‌టికే తార‌క‌ర‌త్న పిల్ల‌ల చ‌దువు బాధ్య‌త‌ను తానే స్వీక‌రిస్తాన‌ని బాల‌య్య స్వ‌యంగా చెప్పారు. ఇక అటు తార‌క‌ర‌త్న ఫ్యామిలీ నుంచి, త‌ల్లిదండ్రుల నుంచి కూడా పిల్ల‌ల విష‌యంలో కేర్ ఉంటుంద‌ని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news