Moviesస్టేజీ పైనే ఆ విషయాని ఓపెన్ గా చెప్పుతూ.. అందరి ముందే...

స్టేజీ పైనే ఆ విషయాని ఓపెన్ గా చెప్పుతూ.. అందరి ముందే వెక్కివెక్కి ఏడ్చేసిన అనసూయ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా సరే అనసూయ అంటే జనాలు ఏ విధంగా ఇష్టపడతారో మనందరికీ బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించినప్పటి నుంచి అనసూయకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది . అయితే ఎందుకో తెలియదు కానీ ఆమె జబర్దస్త్ మానేసిన తర్వాత కొందరు జనాలు కావాలని టార్గెట్ చేసి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు . అయితే ఇలాంటి వాటి గురించి పెద్దగా ఆలోచించని ..బాధపడని అనసూయ తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది.

కాగా తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా రంగమార్తాండ. ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కాగా కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ,రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్ ,శివాని రాజశేఖర్ ..ముఖ్య పాత్రలో నటించారు . కాగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఫాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు .

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనసూయ స్టేజీ పై మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ” సినిమా షూటింగ్ అయిపోయి డబ్బింగ్ తర్వాత నుంచి ..రంగమార్తాండ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని ..ప్రివ్యూ చూసిన తర్వాత సినిమా చాలా బాగా నచ్చిందని..”నా జీవితానికి ఇది చాలు రంగమార్తాండ సినిమాలో నేను కూడా నటించాను అన్నది నాకు సంతృప్తినిచ్చిందని ..సంతోషాన్ని ఇచ్చిందని” చెప్పుకొచ్చింది .అంతేకాదు అలా మాట్లాడుతూ అనసూయ ఎప్పుడు లేని విధంగా స్టేజిపైనే అందరి ముందు కన్నీళ్లు పెట్టుకొని వెక్కివెక్కి ఏడ్చేసింది . దీంతో ఆమెను అలా చూసిన జనాలు కూడా ఎమోషనల్ అయ్యారు . అంతే కాదు అనసూయ ఇంతలా ఆ పాత్రకు కనెక్ట్ అయిందా..? అంటూ కూడా జనాలు పొగిడేస్తున్నారు . ఏది ఏమైనా సరే అనసూయ ఓ మంచి నటి అని రంగమార్తాండ సినిమా ద్వారా మరోసారి ప్రూవ్ చేసుకుంది అంటూ జనాలు ఆమె పేరుని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news