MoviesRRR ఆస్కార్‌ ర‌చ్చ‌…. ఎన్టీఆర్‌ను సైడ్ యాక్ట‌ర్ చేశారంటూ మండుతోన్న తార‌క్...

RRR ఆస్కార్‌ ర‌చ్చ‌…. ఎన్టీఆర్‌ను సైడ్ యాక్ట‌ర్ చేశారంటూ మండుతోన్న తార‌క్ ఫ్యాన్స్ (వీడియో)

త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక యుద్ధం అయితే జరుగుతోంది. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ పాత్రకు రాజమౌళి ఎక్కువ ప్ర‌యార్టీ ఇచ్చాడంటూ తారక్‌ అభిమానులు ఫీలయ్యారు. సోషల్ మీడియాలో ఇదే అంశంపై పెద్ద యుద్ధమే జరిగింది. తారక్ పాత్రకు రాజమౌళి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే.. చరణ్ వీక్ అయిపోతాడని అలా బ్యాలెన్స్ చేశాడన్న చర్చ కూడా తారక్‌ అభిమానుల నుంచి వచ్చింది.

ఆ సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు చెర్రీ అభిమానుల హంగామాయే కాస్త ఎక్కువ అనిపించింది. అయితే ఆ తర్వాత చిరంజీవి – చరణ్‌ కలిసిన నటించిన ఆచార్య ప్లాప్ అయ్యింది. రాజమౌళి మాకు అన్యాయం చేసినా.. కొరటాల శివ న్యాయం చేశాడంటూ తారక అభిమానులు ట్రోల్ చేశారు. ఆ వివాదం అక్కడితో ముగిసింది. అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా నుంచి నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ అవార్డు రేసులో ఉన్న విషయం తెలిసిందే.

ఈ నెల 12న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. దీంతో త్రిబుల్ ఆర్ టీం అమెరికాలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే రాంచరణ్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. చరణ్ తాను పాటించే అయ్యప్ప మాల విశిష్టత, విధివిధానాలను వివరించడంతో పాటు త్రిబుల్ ఆర్ సినిమా గురించి కొన్ని విషయాలు వెల్లడించాడు. యాంకర్ ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడే సమయంలో ఎన్టీఆర్‌ను సైడ్ యాక్టర్ అన్నాడంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ క్లీప్‌ వైరల్ అవుతుంది.

ఇది చూసిన తారక్ ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కావాలని తమ అభిమాన హీరోను సైడ్ యాక్టర్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అయితే వాస్తవానికి ఆ హోస్ట్ తారక్‌ను సైడ్ యాక్టర్ అని పిలవలేదు. నీతో పాటు కలిసి నటించిన నటుడు అని పేర్కొన్నాడు. అయితే కొందరు నెటిజన్లు సగం క్లిప్ కట్ చేసి వైరల్ చేయడంతో ఈ వివాదం చెలరేగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news