MoviesNTR 30: రాజ‌మౌళికి జాన్వీక‌పూర్ ఇచ్చిన స్లిప్ ఏంటి… అందులో ఏం...

NTR 30: రాజ‌మౌళికి జాన్వీక‌పూర్ ఇచ్చిన స్లిప్ ఏంటి… అందులో ఏం రాసింది…!

ఎట్టకేలకు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభం అయింది. గత కొద్ది రోజుల నుంచి ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం జరుపుకుంది. కొరటాల శివ, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్, దర్శ‌కులు రాజమౌళి, ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీకపూర్, ప్రకాష్ రాజ్ శ్రీకాంత్‌తో పాటు ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అయితే ఈ అధికారిక లాంచ్ అవ్వకముందు దర్శకుడు రాజమౌళి హీరోయిన్ జాన్వి కపూర్ మధ్య ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. రాజమౌళి.. జాన్వీ కపూర్ తో చాలాసేపు ముచ్చటించారు. అలాగే జాన్వీకపూర్ కి ఏదో ఒక పేపర్ ఇచ్చి ఆమెతో ఏదో రాయించుకున్నారు. దీంతో అక్కడున్న వాళ్లకు వారిద్దరి మధ్య ఏంటి ? ఇంతసేపు సంభాషణ జరిగింది అన్నది అంతు పట్టలేదు.

రాజమౌళి తాను మహేష్ బాబుతో తీసే సినిమా కోసం జాన్వీని హీరోయిన్గా తీసుకోవడానికి.. ఆమెతో సంతకం పెట్టించుకున్నారు అంటూ గుసగుసలాడుకున్నారు. అయితే అసలు కథ అది కాదు.. రాజమౌళి కుమార్తె మయూఖ జాన్వీకి వీరాభిమాని అని తెలిసింది. రాజమౌళి ఎలాగూ ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు కదా.. అందుకే మయూఖ జాన్వీకపూర్ ఆటోగ్రాఫ్ కావాలని తన తండ్రిని అడిగిందట.

అందుకే రాజమౌళి జాన్వీకపూర్ తో ప్రత్యేకంగా ఆటోగ్రాఫ్ చేయించుకున్నాడు. ముందు జాన్వి ఒక కాగితం మీద ఆమె సంతకం చేసి ఇవ్వబోయింది. అయితే రాజమౌళి అలా వద్దు… మంచి కొటేషన్ తో పాటు తన కూతురి పేరు కూడా రాయమని రిక్వెస్ట్ చేశారు. అప్పుడు జాన్వీ ఇంకో పేపర్ మీద అలాగే రాసి ఇచ్చిందట. రాజమౌళి ఆ పేపర్లను జాగ్రత్తగా పెట్టుకుని ఇంటికెళ్లి తన కూతురికి ఇస్తారట. అది అసలు విషయం. ఈ విషయం తెలియని చాలామంది మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో జాన్వీ హీరోయిన్ అని గుసగుసలాడుకోవడం కనిపించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news