Moviesమ‌హేష్‌ను అలా వ‌దిలేసిన న‌మ్ర‌త‌.. పాపం మ‌న ప్రిన్స్ ఏమైపోతాడో క‌దా...!

మ‌హేష్‌ను అలా వ‌దిలేసిన న‌మ్ర‌త‌.. పాపం మ‌న ప్రిన్స్ ఏమైపోతాడో క‌దా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే గత నాలుగు ఐదు నెలల కాలంలో మహేష్ ఇంట్లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మహేష్ తల్లి ఇందిరాదేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు కొద్ది నెలల తేడాలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మహేష్ కూడా ఈ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొని బయట కార్యక్రమాలకు వెళుతున్నారు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఈ సినిమాలో పూజ హెగ్డేతో పాటు శ్రీలీల‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నీ కుదిరితే వచ్చే ఆగస్టు లేదా దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక మహేష్ చిన్న గ్యాప్ వస్తే చాలు తన ఫ్యామిలీతో కలిసి విదేశీ వెకేషన్ల‌కు చెక్కేస్తున్నారు. మహేష్ ఎప్పుడు విదేశీ పర్యటనలు చేసినా తన భార్య నమ్ర‌త‌ కచ్చితంగా పక్కనే ఉండాలి. ఇక కొన్నిసార్లు పిల్లలు సితార, గౌతమ్ తో కూడా కలిసి వెళ్లి పది పదిహేను రోజులు పాటు అక్కడే ఉండి ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు.

మహేష్ తన భార్య నమ్రతతో పాటు పిల్లలకు మంచి ఎంజాయ్మెంట్ ఇస్తూ ఉంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఈ విషయంలో ఎప్పుడు వాళ్లకు అన్యాయం చేయడు. ఏడాదిలో కనీసం నాలుగు ఐదు సార్లు అయినా కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళుతూ ఉంటాడు. అయితే ఈసారి మహేష్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉండడంతో నమ్రత మనోడికి కాస్త షాక్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. మహేష్ లేకుండానే నమ్రత, సితార ఇద్దరు కలిసి విదేశీ వెకేషన్ కు ప్లాన్ చేసుకున్నారు.

త్రివిక్రమ్ ఇప్పట్లో మనవాడిని వదిలేలా లేడు. అందుకే నమ్రత, సితార కలిపి ఈసారి ఇద్దరు ఎయిర్‌పోర్ట్ లో సందడి చేశారు. గౌతమ్ ఇప్పటికే విదేశాలలో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా మహేష్ లేకుండా నమ్రత, సితార ఫస్ట్ టైం వెకేషన్‌కు వెళుతున్నారు. అయితే వీరు గౌతమ్ దగ్గరకే వెళుతున్నారా లేదా వేరే దేశానికి వెళుతున్నారా ? అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news