Movies"అదే నా కొడుకు కొంప ముంచింది"..వేణు మాధవ్ తల్లి షాకింగ్ కామెంట్స్..!!

“అదే నా కొడుకు కొంప ముంచింది”..వేణు మాధవ్ తల్లి షాకింగ్ కామెంట్స్..!!

వేణుమాధవ్ .. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న వేణుమాధవ్ . ఎంతో మంది స్టార్స్ తో కలిసి సినిమాలో నటించాడు . కోదాడ నుంచి సాధారణ మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరియర్ను స్టార్ట్ చేసిన వేణుమాధవ్.. చాలా తక్కువ టైంలోనే ఇండస్ట్రీలోకి వచ్చి మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకొని కోట్లకు కోట్ల ఆస్తిని సంపాదించుకున్నాడు .

ఒకానొక టైంలో స్టార్ హీరోస్ కూడా మా సినిమాలో వేణుమాధవ్ ఉండాలి అంటూ పట్టు బట్టి మరి ఆయనను తమ సినిమాల్లో పెట్టుకొని కామెడీ చేసి నవ్వించే విధంగా సీన్స్ పండించే వాళ్ళు..కాగా ఇండస్ట్రీలోకి ఎంత త్వరగా వచ్చి స్టార్ గా మారాడో.. అంతే త్వరగా తన జీవితాన్ని ముగించేసుకున్నాడు వేణుమాధవ్ . కొన్ని ఆరోగ్య కారణాల చేత ఆయన మరణించారు. అయితే అప్పటికే ఆస్తులు బాగా సంపాదించుకున్న వేణుమాధవ్ ఇప్పటికీ జనాల మనసుల్లో చిరస్థాయిగా మిగిలిపోతున్నాడు .

రీసెంట్గా వేణుమాధవ్ తల్లి సావిత్రమ్మ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టింది . ఈ క్రమంలోనే ఆమె అద్దె ఇంట్లో ఉంటున్నాను అంటూ చెప్పి షాక్ ఇచ్చింది . కోట్లకు కోట్లు ఆస్తి సంపాదించిన వేణుమాధవ్ తల్లి ఇలా అద్దె ఇంట్లో ఉండడం ఏంటా అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు .కాగా సావిత్రమ్మ మాట్లాడుతూ ..”నాకు ముగ్గురు మగ పిల్లలు .. వేణుమాధవ్ చిన్నప్పటినుంచి చాలా చురుగ్గా ఉండేవాడు ..మిమిక్రీ బాగా చేసేవాడు ..అప్పుడు ఎస్ వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గారు చూసి సినిమాలో అవకాశాలు ఇచ్చారు .

ఆ అవకాశాన్ని వేణుమాధవ్ బాగా ఉపయోగించుకున్నారు . కానీ చిన్న వయసులోనే నా బిడ్డ అర్ధాంతరంగా మరణించాడు. వేణుమాధవ్ కి ఉన్న చెడ్డ అలవాటే ఆయన ప్రాణాలను తీసేసింది . ఎప్పుడు ఏ జబ్బు వచ్చినా సరే మందులు వేసుకునే వాడు కాదు . చిన్నప్పటి నుంచి అదే అలవాటు వచ్చింది. ఈ క్రమంలోనే పెద్ద అయిన తర్వాత కూడా జబ్బుకి మందులు వేసుకోకుండానే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది . నిజం చెప్పాలంటే అదే అతని కొంపముంచింది అన్నారు సావిత్రమ్మ. ఇలా సావిత్రమ్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news