Moviesనందమూరి అభిమానులకు కాలర్ ఎగరేసే న్యూస్..ఎన్టీఆర్‌ దేవుడి రా సామి..!!

నందమూరి అభిమానులకు కాలర్ ఎగరేసే న్యూస్..ఎన్టీఆర్‌ దేవుడి రా సామి..!!

గత కొన్ని నెలలుగా ఎప్పుడు ఎప్పుడా అంటూ నందమూరి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేసిన అప్డేట్ మరి కొద్ది రోజుల్లోనే రాబోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ ను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్.. తన తర్వాతి సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను రిలీజ్ చేసిన కొరటాల ఆ తర్వాత సినిమా గురించి పట్టించుకోవడమే మానేశాడు .

ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ ఆయనను టార్గెట్ చేస్తూ పరోక్షకంగా కౌంటర్స్ వేశారు . ఎట్టకేలకు న్యూ ఇయర్ సందర్భంగా నందమూరి అభిమానులకు కాలర్ ఎగరేసే న్యూస్ అందించాడు కొరటాల శివ . ఎన్టీఆర్ థర్టీ సినిమాపై అప్డేట్ ఇచ్చాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్గా ప్రారంభం కానుందని .. 2023 ఏప్రిల్ 5న గ్రాండ్గా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందని చెప్పుకొచ్చారు . అయితే ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4న ఈ సినిమా షూటింగ్ అట్టహాసంగా ప్రారంభం కావాల్సి ఉంది.

కాగా తారకరత్న హెల్త్ కండిషన్ బాగోలేని కారణంగా ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి. కాగా ఎట్టకేలకు ఆ వార్తలు నిజమే అంటూ తెలుస్తుంది . నిజానికి తారక్ ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను గ్రాండ్గా ప్రారంభించడానికి సిద్ధపడ్డారట . అయితే తారకరత్న హెల్త్ కండిషన్ బాగోలేని కారణంగా ఈ సినిమా షూట్ ను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూట్ ఏకంగా ఫిబ్రవరి 21వ తేదీ కి పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది . కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా రష్మిక మందన . మృణాల్ ఠాకూర్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఏది ఏమైనా సరే ఎన్టీఆర్ 30 సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు తారక్ కంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news