MoviesNaresh-Pavitra న‌రేష్ - ప‌విత్రా పెళ్లిలో మ‌రో పెద్ద ట్విస్ట్ ఇది….!

Naresh-Pavitra న‌రేష్ – ప‌విత్రా పెళ్లిలో మ‌రో పెద్ద ట్విస్ట్ ఇది….!

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప‌విత్రా లోకేష్ కొత్త లైఫ్‌లోకి ఎంట‌ర్ కాక‌ముందే అనేక స‌మ‌స్య‌లు వీరిని చుట్టుముడుతున్నాయి. న‌రేష్ – ప‌విత్రాను పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఆమెను చుంబిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో న‌రేష్‌, ప‌విత్ర త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అంద‌రికి ఓ క్లారిటీ వ‌చ్చేసింది. అయితే ఈ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి న‌రేష్ మూడో భార్య ర‌మ్య మ‌రింత‌గా రెచ్చిపోయింది.

ఇంట‌ర్వ్యూల‌తో న‌రేష్‌, ప‌విత్ర‌ను టార్గెట్‌గా చేసుకుని అనేక విమ‌ర్శ‌లు చేసింది. ఈ విమ‌ర్శ‌ల‌కు న‌రేష్ కూడా మీడియా ముందుకు వ‌చ్చి మ‌రీ కౌంట‌ర్లు ఇచ్చారు. తాను విడాకులు ఇచ్చేదే లేద‌ని.. తాను న‌రేష్‌తోనే క‌లిసి కాపురం చేస్తాన‌ని ర‌మ్య చెపుతుంటే.. న‌రేష్ మాత్రం విడాకులు కోర్టులో ఉన్నాయ‌ని.. ఆమెతో క‌లిసి కాపురం చేసేదే లేద‌ని చెపుతున్నాడు. ప‌విత్ర‌తో క‌లిసి జీవించేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని చెప్ప‌క‌నే చెప్పేశాడు.

అస‌లు న‌రేష్ – ర‌మ్య‌కు విడాకులు ఎప్పుడు వ‌స్తాయో ? ప‌విత్ర‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో ? అన్న స‌స్పెన్స్ కొన‌సాగుతుండ‌గానే వీరి వివాదంలో మ‌రో ట్విస్ట్ చోటు చేసుకుంది. రీసెంట్‌గా న‌రేష్ ఆర్థిక లావాదేవీల నేప‌థ్యంలో ఆస్తి కోసం త‌న‌ను చంపాల‌ని త‌న ఇంటి వ‌ద్ద రెక్కీ కూడా నిర్వ‌హించింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది.

ఇక ఇప్పుడు గ‌చ్చిబౌలిలోని న‌రేశ్ ఇంటి వ‌ద్ద పార్క్ చేసి ఉన్న కారుపై గుర్తు తెలియ‌ని దండుగులు ధ్వంసం చేయ‌డం ఈ ప‌ని ఖ‌చ్చితంగా త‌న మూడో భార్య ర‌మ్య చేయించింద‌ని న‌రేష్ ఆరోప‌ణ‌. దీనిపై పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశాడు. ప్ర‌స్తుతం పోలీసులు కారును ధ్వంసం చేసిన దండుగుల ఆచూకీని క‌నుగునే ప‌నిలో ఉన్నారు. ఏదేమైనా ర‌మ్య మాత్రం న‌రేష్ పెళ్లి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌ర‌గ‌నివ్వ‌ని శ‌ప‌థాలు చేస్తుంటే న‌రేష్ మాత్రం ర‌మ్య‌ను ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా వ‌దిలించుకోవాల‌ని చూస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news