Moviesఅది తలుచుకుని స్టేజీ పైనే చిరంజీవి ఎమోషనల్‌..గ్లిజరిన్‌ లేకుండానే కన్నీళ్లు..!!

అది తలుచుకుని స్టేజీ పైనే చిరంజీవి ఎమోషనల్‌..గ్లిజరిన్‌ లేకుండానే కన్నీళ్లు..!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. సైలెంట్ డైరెక్టర్ బాబి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మూడు రోజుల్లోనే 100 కోట్లు క్రాస్ చేసి మెగాస్టార్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా రికార్డ్ నెలకొల్పింది. ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ ను హనుమకొండలో గ్రాండ్ గా చేశారు వాల్తేరు వీరయ్య చిత్ర బృందం .

Waltair Veerayya Box Office Collection Day 9: Chiranjeevi-Ravi Teja's film  sees big jump | Regional-cinema News – India TV

కాగా ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు . ఈ క్రమంలోనే చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ముఖ్యంగా ఆయన రవితేజ గురించి మాట్లాడిన విధానం జనాలకు అమితంగా నచ్చేసింది. ఆయన మాట్లాడుతూ ..”ఈ సినిమాలో రవితేజ పర్ఫామెన్స్ చాలా బాగా అనిపించింది. రవితేజ ని చూస్తుంటే నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు . ప్రతి షాట్ లోను అదే ఫీలింగ్ తో నటించాను. అప్పట్లో ఇద్దరు ఒకేలా ఉండేవారు . అంతేకాదు రవిలో నా తమ్ముడిని చూసుకున్నానను.

మరీ ముఖ్యంగా రవితేజ ఈ సినిమాలో చనిపోతున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేసింది . నిజంగానే ఆ ప్లేస్ లో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఊహించుకొని మరి గ్లిజరిన్ లేకుండా ఏడ్చేసాను . అక్కడ మరి ఏ హీరో ఉన్నా నేను అలా ఎమోషన్ అయ్యే వాడిని కాదేమో . అందుకే ఆటోమేటిక్గా నాకు కన్నీళ్లు వచ్చేసాయి . అంతేకాదు ఆ సీన్ అయిపోగానే దర్శకుడు నిర్మాతలు కూడా నన్ను బాగా పొగిడేసారు . ఇప్పటికి చెప్తున్నాను .. పవన్ కళ్యాణ్ ఎంతో రవితేజ కూడా అంతే” అంటూ చాలా ఎమోషన్ అయ్యారు . ఈ క్రమంలోని రవితేజ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news