Moviesమంచు ల‌క్ష్మికి ముందు మ‌రో వ్య‌క్తితో పెళ్లి చేసింది ఎవ‌రు... ఆమె...

మంచు ల‌క్ష్మికి ముందు మ‌రో వ్య‌క్తితో పెళ్లి చేసింది ఎవ‌రు… ఆమె మొద‌టి భ‌ర్తతో ఎందుకు విడిపోయింది..?

టాలీవుడ్ లో సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మంచి మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న. తండ్రి గారాల పట్టి అయిన లక్ష్మీ ప్రసన్న డేరింగ్ & డాషింగ్ అమ్మాయిగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. కాస్త ముదురు వయసులో సిద్ధార్థ్‌ – శృతిహాసన్ జంటగా వచ్చిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో ఐరేంద్రి అనే లేడీ విలన్ పాత్రలో ప్రేక్షకులను పలకరించిన లక్ష్మి తొలి సినిమాతోనే లేడీ విలన్ గా తన విశ్వరూపం ప్రదర్శించింది. ఆ తర్వాత నిర్మాత అవతారం ఎత్తి గుండెల్లో గోదారి సినిమా చేసి ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.

బాలయ్య గెస్ట్ రోల్ చేసిన ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో సెంటిమెంట్ పాత్రలో మెప్పించింది. ల‌క్ష్మి త‌న ఇంగ్లీష్ డైలాగుల ద్వారా ట్రోలింగ్‌కు గురైనా ఆమె అలా కూడా ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది. అయితే ల‌క్ష్మి ఎంత డేరింగ్‌గా ఉంటుందో ఆమె మ‌న‌స్సు అంత వెన్న‌. ఆమె తెలియ‌కుండానే ఎక్కువ సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ఉంటుంది. పేద పిల్ల‌ల‌కు త‌మ విద్యాసంస్థ‌ల్లో రాయితీల‌తో కూడిన చ‌దువు చెప్పించ‌డం, కొంద‌రికి ఫ్రీ ఎడ్యుకేష‌న్ ఇప్పించ‌డం చేస్తున్నా.. దీని గురించి ఆమె బ‌య‌ట ఎక్క‌డా చెప్పుకోరు.

ఇక ఆమె వ్య‌క్తిగ‌త జీవితంలో ఎవ్వ‌రికి తెలియ‌ని విష‌యాలు కూడా ఉన్నాయి. ఆమె ప్ర‌స్తుతం త‌న భ‌ర్త ఆండీ శ్రీనివాస్‌తో క‌లిపి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అయితే ల‌క్ష్మికి ముందే ఒక పెళ్ల‌య్యింద‌న్న టాక్ ఉంది. ఈ విషయం చాలా రోజుల వ‌ర‌కు ఎవ్వ‌రికి తెలియ‌దు. ప్ర‌స్తుత తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఓ ప్రెస్‌మీట్లో మంచు ల‌క్ష్మి మొద‌టి భ‌ర్త గురించి చేసిన కామెంట్ల‌తో ఈ విష‌యం ప్ర‌పంచానికి తెలిసింది. అత‌డి పేరు లండ‌న్ శ్రీనివాస్‌.

ల‌క్ష్మి హైద‌రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్‌లో చ‌దువుకునే రోజుల్లో స్నేహితుడు లండ‌న్ శ్రీనివాస్‌ను ప్రేమించి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంద‌ని అంటారు. అప్పుడు వీరి ప‌క్క‌న కొద్ది మంది స్నేహితులు మాత్ర‌మే ఉన్నార‌ని అంటారు. అయితే ఈ పెళ్లి మోహ‌న్‌బాబుకు ఇష్టం లేక‌పోవ‌డంతో వీరిని మోహ‌న్‌బాబు బ‌ల‌వంతంగా విడ‌దీసి ల‌క్ష్మిని థియేట‌ర్ ఆర్ట్స్ కోర్సు నేర్చుకునేందుకు అమెరికా పంపేశార‌ని అంటారు. అప్పుడే ఆమెకు అక్క‌డే ఉన్న ఎన్ ఆర్ ఐ ఆండీ శ్రీనివాస్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డి పెళ్లి వ‌ర‌కు వ‌చ్చింది.

2006లో మోహ‌న్‌బాబు ఇష్టంతోనే వీరి పెళ్లి జ‌రిగింది. ఇక పెళ్ల‌య్యాక తొలినాళ్ల‌లో భ‌ర్త‌తో ల‌క్ష్మికి విబేధాలు రావ‌డంతో ఇండియాకు తిరిగి వ‌చ్చేసింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. 2014లో స‌రోగ‌సీ విధానంతో ల‌క్ష్మి ఓ కుమార్తెకు జ‌న్మ‌నిచ్చాక భ‌ర్త‌తో ఆమె దాంప‌త్య బంధం బ‌ల‌ప‌డింది. దేశంలోనే అమీర్‌ఖాన్‌, షారుక్‌ఖాన్ త‌ర్వాత సరోగ‌సీ విధానంలో బిడ్డ‌కు జన్మ‌నిచ్చిన మూడో సెల‌బ్రిటీ ల‌క్ష్మీ. ఇప్పుడు ఆమె టీవీ షోల్లో బిజీగా ఉన్నారు. సోష‌ల్ మీడియాలోనూ ఎప్ప‌టిక‌ప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news