Moviesఆ హీరోయిన్ అమ్మను చూసి నాకు భ‌యం వేసింది.. సుకుమార్ సంచ‌ల‌న...

ఆ హీరోయిన్ అమ్మను చూసి నాకు భ‌యం వేసింది.. సుకుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టాలీవుడ్ లో డైరెక్టర్ సుకుమార్ ఎంత స్పెష‌లో తెలిసిందే. సుకుమార్ చేసింది త‌క్కువ సినిమాలే అయినా సుకుమార్ సినిమాల కోసం వెర్రెక్కిపోయే వీరాభిమానులు ఉన్నారు. సుకుమార్ ప్లాప్ సినిమాలు కూడా ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తారు. మ‌హేష్‌బాబుతో సుకుమార్ తీసిన వ‌న్ నేనొక్క‌డినే సినిమా ప్లాప్ అయినా ప్రేక్ష‌కుల‌ను బాగా మెప్పించింది. సుకుమార్ టేకింగ్ కు ఎంతో మంది ఫిదా అయిపోయారు.

ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌తో నాన్న‌కు ప్రేమ‌తో, రామ్‌చ‌ర‌ణ్‌తో రంగ‌స్థ‌లం, అల్లు అర్జున్‌తో పుష్ప సినిమాలు తీసి సూప‌ర్ హిట్లు కొట్టాడు. ఇప్పుడు పుష్ప‌కు సీక్వెల్‌గా పుష్ప 2 వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సుక్కు క్రేజ్ అయితే మామూలుగా లేదు. తాజాగా సుక్కు ఓ ఇంట్ర‌స్టింగ్ మ్యాట‌ర్ రివీల్ చేశారు. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్ శిష్యుడు ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వంలో 18 పేజెస్ సినిమా తెర‌కెక్కింది.

ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌పై సుకుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లం సినిమాలో స‌మంత హీరోయిన్‌. ఈ సినిమా స‌మంత‌కు ఎంతో మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఈ సినిమాలో ముందుగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌నే హీరోయిన్‌గా అనుకున్నార‌ట‌.

అయితే ఈ సినిమా కోసం అనుప‌మ‌ను ఆడిష‌న్స్ చేస్తున్న ప్ర‌తిసారి కూడా ఆమె వాళ్ల అమ్మ వైపు చూసేద‌ట‌. ఇటు అనుప‌మ వాళ్ల అమ్మ వైపు చూస్తుండ‌డం, వాళ్ల అమ్మ ఇటు చూస్తుండ‌డంతో త‌న‌కు భ‌యం వేసే ఆమెను త‌ప్పించేసి ఆ ప్లేసులో స‌మంత‌ను తీసుకున్నాన‌ని చెప్పారు. అలా అనుప‌మ వాళ్ల అమ్మ దెబ్బ‌తో సుకుమార్‌కు భ‌యం ఏమో గాని అనుప‌మ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news