Moviesఅనుప‌మ ఆ యంగ్ హీరో అంత టార్చ‌ర్ పెట్టాడా... దండం పెట్టేసి...

అనుప‌మ ఆ యంగ్ హీరో అంత టార్చ‌ర్ పెట్టాడా… దండం పెట్టేసి వెళ్లిపోయిందా…!

టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్ టైంలో ఎన్ని హిట్లు వ‌చ్చినా వాళ్ల‌లో ఇసుమంత గ‌ర్వం కూడా ఉండేదే కాదు. కృష్ణ లాంటి హీరోలు ఒకే యేడాది 20కు పైగా సినిమాలు చేసేవారు. హిట్లు వ‌స్తే వాళ్లు యేనాడు ఓవ‌ర్‌గా ఫీల్ అయ్యేవాళ్లు కాదు. సినిమా జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వారు సినిమాలు చేస్తూ అంద‌రితోనూ క‌లుపుగోలుగా ఉండేవారు. అయితే ఇప్పుడున్న యంగ్ హీరోల యాట్యిట్యూడ్ వేరుగా ఉంటోంది.

ఒక‌టి రెండు హిట్లు వ‌స్తే హీరోలు, హీరోయిన్లు కూడా ఓవ‌ర్‌గా ఫీల్ అవ్వ‌డం, రెమ్యున‌రేష‌న్ పెంచేయ‌డం, యాట్యిట్యూడ్ త‌ల‌కు ఎక్కించుకోవ‌డం.. వారి బిల్డ‌ప్పులు చూడ‌లేక‌పోతున్నాం. అయితే ఇప్పుడు డీజే టిల్లు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ విష‌యంలో ఇదే జ‌రుగుతోంద‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పుడు సిద్ధు జొన్న‌లగ‌డ్డ బుట్ట‌బొమ్మ‌లో హీరోగా ఓకే చేసి త‌ర్వాత క్యాన్సిల్ చేశాడు.

ఇక ఇప్పుడు డీజే టిల్లు 2 సినిమా విష‌యంలో ఇష్టం వ‌చ్చిన‌ట్టు చేస్తున్నాడ‌న్న పుకార్లు వినిపిస్తున్నాయి. కార్తీకేయ 2 లాంటి సూప‌ర్ హిట్ కొట్టిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇక అంత‌కంటే ముందుగా క‌థ‌లో వేలు పెట్టి కెలికేయ‌డంతో క‌థ మారిందంటున్నారు. ఇక హీరోయిన్ విష‌యంలో ఇప్ప‌టికే రెండు మూడుసార్లు మార్పులు జ‌రిగాయి. ఇక తాజా అప్‌డేట్ ఏంటంటే అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను కూడా బ‌య‌ట‌కు పంపేశార‌ని అంటున్నారు.

కేవ‌లం హీరో సిద్ధు వ‌ల్లే ఆమెతో స‌రిగా పొస‌గలేద‌ని.. ఆమె ఇబ్బంది ప‌డింద‌ని.. ఇద్ద‌రికి ఎక్క‌డో తేడా రావ‌డంతో ఆమె సినిమా నుంచి అవుట్ అయ్యిందంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి ప్రేమ‌మ్ ఫేం మడోన్నా సెబాస్టియన్ ను తీసుకుంటున్నారు. అయితే ఇక్క‌డ త‌ప్పంతా సిద్ధుదే కాద‌ని.. అటు అనుప‌మ వైపు నుంచి కూడా ఉంద‌ని.. ఆమె కూడా డేట్ల విష‌యంలో క్లారిటీతో లేద‌ని.. దీంతో అంద‌రూ ఇబ్బంది ప‌డుతున్నార‌ని అంటున్నారు.

అందుకే అనుప‌మ కెరీర్ కూడా తెలుగులో మ‌రీ అంత గొప్ప‌గా ముందుకు సాగ‌డం లేదంటున్నారు. కార్తీకేయ 2 హిట్ త‌ర్వాత ప్ర‌స్తుతం ఆమె తెలుగులో 18 పేజెస్ సినిమా చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news