Moviesబిగ్ షాకింగ్: సమంతలానే ఆ డైరెక్టర్ కు అరుదైన వ్యాధి.. ఇన్నాళ్లకు...

బిగ్ షాకింగ్: సమంతలానే ఆ డైరెక్టర్ కు అరుదైన వ్యాధి.. ఇన్నాళ్లకు ఓపెన్ గా చెప్పేసాడు..!!

ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గానే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు అఫీషియల్ గా చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లు సోషల్ మీడియాకి దూరంగా ఉన్న సమంత ఒక్కసారిగా యాక్టివ్ అవుతూ ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. అంతేకాదు అందుతున్న సమాచారం ప్రకారం సమంత ముఖం మొత్తం ఉబ్బిపోయిందని తెలుస్తుంది. ఈ వ్యాధి మరింత ముదిరిపోతే కేవలం మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు .

 

అయితే సమంత ఈ వ్యాధి కారణంగా తీవ్ర కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ క్రమంలోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను అంటూ ఓపెన్ గా చెప్పేసాడు టాలీవుడ్ జాతి రత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్. మనకు తెలిసిందే ఈ సినిమా టైంలో అనుదీప్ చాలా ఫేమస్ అయ్యాడు . తన స్టైల్ లో నవ్విస్తూ అమాయకంగా అడిగిన వాటికి ఆన్సర్ ఇవ్వకుండా ..అడగని వాటికి ఏదో అనుసరిస్తూ జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ కామెడీని పండించాడు.

కాగా రీసెంట్ గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకు సమంతలనే ఓ వ్యాధి ఉంది అంటూ బిగ్ బాంబ్ పేల్చాడు. హెచ్ ఎస్ పి అనే డిజాస్టర్ తో బాధపడుతున్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ వ్యాధి ఉన్నవారికి గూట్లెన్ అస్సలు పడదని.. కాఫీ తాగితే రెండు రోజులు అస్సలు నిద్ర రాదని ..ఏదైనా పండ్ల రసం తాగితే మైండ్ సెట్ అవుతుందని.. లేకపోతే చిరాగ్గా ఉంటారని ..ఎక్కువ లైట్స్ పడిన నా కళ్లు కనిపించవని ..ఘాటైన వాసనలను పిలిస్తే నేను స్పృహ తప్పుతానని చెప్పుకొచ్చారు. దీంతో అనుదీప్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు కొందరు ఆయన వ్యాధిని ట్రోల్ చేస్తున్నారు. సమంత వ్యాధి చెప్పగానే నీకు ఇప్పుడు నీ వ్యాధి గురించి గుర్తొచ్చిందా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news