Moviesరానా ఆ హీరోయిన్‌ను పిచ్చిగా ప్రేమించాడా... ఏం లేకుండానే ఆ పుకార్లు...

రానా ఆ హీరోయిన్‌ను పిచ్చిగా ప్రేమించాడా… ఏం లేకుండానే ఆ పుకార్లు ఎలా వ‌చ్చాయ్‌…!

టాలీవుడ్‌లో ద‌గ్గుబాటి ఫ్యామిలీకి ఎంతో సుధీర్ఘ‌మైన చ‌రిత్ర ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి లెజెండ్రీ నిర్మాత దివంగ‌త రామానాయుడు త‌ర్వాత ఆయ‌న వార‌సులు వెంక‌టేష్ హీరోగా, సురేష్‌బాబు స్టార్ ప్రొడ్యుస‌ర్‌గా కొన‌సాగుతూ వ‌స్తున్నారు. ఇక మూడో త‌రంలో ఇప్ప‌టికే సురేష్‌బాబు పెద్ద కుమారుడు రానా హీరోగా ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. ఇక రానా సోద‌రుడు, సురేష్‌బాబు రెండో కుమారుడు అభిరాం కూడా త్వ‌ర‌లోనే హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

నిజానికి రానాది మంచి మ‌న‌స్త‌త్వ‌మే. ఉన్నంత‌లో ప‌దుగురికి సాయం చేయాల‌న్న గుణం ఉన్న‌వాడే. అయితే రానా ప‌ర్స‌న‌ల్ అల‌వాట్ల వ‌ల్ల మాత్రం చాలా రోజుల పాటు కాంట్ర‌వ‌ర్సీల‌తో వార్త‌ల్లో నిలిచేవాడు. కొన్ని అల‌వాట్లు రానాను బ‌ల‌హీనుడిగా మార్చేశాయి. రానా ప‌లువురు హీరోయిన్ల‌తో ఎఫైర్లు న‌డిపాడ‌న్న పుకార్లు అయితే వినిపించేవి. అయితే ఇందుకు కార‌ణాలు కూడా ఉన్నాయి. ఓ సారి చెన్నై చిన్న‌ది త్రిష‌తో మందుకొట్టి తూలుపోతూ మీడియా కెమేరాల‌కు చిక్కాడు.

అప్పుడు మీడియా వాళ్లు ఫొటోలు తీస్తున్నా.. త్రిష‌ను ప‌ట్టుకుని త‌న కారులో వెళ్లిపోయాడు. దీనిపై చాలా రాద్దాంత‌మే న‌డిచింది. త్రిష‌తో చాలా రోజుల పాటు డీప్‌ల‌వ్‌లో ఉన్నాడ‌ని అంటారు. అయితే త్రిష‌ను త‌మ ఇంటి కోడ‌లిగా చేసుకోవ‌డం సురేష్‌బాబుకు ఏ మాత్రం ఇష్టంలేదు. ఆ త‌ర్వాత క‌న్న‌డ హీరోయిన్ రాగిణి ద్వివేదితో కూడా రానా ప్రేమ‌లో ఉన్న‌ట్టు పుకార్లు అయితే వినిపించాయి.

రానాకు మిహికా బ‌జాబ్‌తో పెళ్లి జ‌ర‌గ‌డానికి యేడాది ముందే రానా – రాగిణి ఎఫైర్ వార్త‌లు బాగా వైర‌ల్ అయ్యాయి. అస‌లు రానా – మిహికా క‌లిసి ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. ఆమె 2009లో క‌న్న‌డ‌లో వ‌చ్చిన వీర మ‌డ‌క్క‌రి సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. తెలుగులో నాని హీరోగా వ‌చ్చిన జెండా పైక‌పిరాజు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా స‌రిగా ఆడ‌క‌పోవ‌డంతో ఆమెను ఇక్క‌డ ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు.

అయితే రాగిణి మోడ‌ల్ కూడా కావ‌డంతో అలా రానాతో ఏర్ప‌డిన ప‌రిచ‌యంతో వీరిద్ద‌రి మ‌ధ్య కొంత వ‌ర‌కు సాన్నిహిత్యం ఉన్న మాట నిజ‌మే. స‌హ‌జంగానే అప్ప‌టికే త్రిష‌తో బ్రేక‌ప్ అయ్యి ఉండ‌డంతో పాటు రానా ప్లే బాయ్ కావ‌డంతో రానా – రాగిణి బంధంపై ర‌క‌ర‌కాల వార్త‌లు అల్లేశారు. అయితే ఆ త‌ర్వాత డ్ర‌గ్స్ ఇష్యూలో సంజ‌న గ‌ల్రానీతో పాటు రాగిణిపై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆమె కెరీర్ మ‌రింత కాంట్ర‌వ‌ర్సీ అయ్యింది. ప్ర‌స్తుతం రాగిణి న‌న్నొబ్బ బ‌ర‌తియా అనే క‌న్న‌డ సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఆమె గాయ‌ప‌డి ప్ర‌స్తుతం చికిత్స కూడా తీసుకుంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news