Moviesదటీజ్ ఎన్టీఆర్.. అంత మంది జనంలో ఏం చేసారో చూడండి.. వీడియో...

దటీజ్ ఎన్టీఆర్.. అంత మంది జనంలో ఏం చేసారో చూడండి.. వీడియో వైరల్..!!

నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా ..తనకంటూ స్పెషాలిటీ బజ్ ను క్రియేట్ చేసుకుంటారు . అంతేకాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం.. నచ్చింది నచ్చినట్లు చేయడం జూనియర్ ఎన్టీఆర్ లోని మరో స్పెషాలిటీ . మన తెలుగు ఇండస్ట్రీలో ఇలా ఉండే హీరోలు చాలా తక్కువ .

 

అందుకే జూనియర్ ఎన్టీఆర్ కి యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. కేవలం సినిమాల పరంగానే కాదు ఆయన వ్యక్తిగత విషయాలను ..వ్యక్తిగత తీరును ఇష్టపడే జనాలు బోలెడు మంది ఉన్నారు. మనకు తెలిసిందే రీసెంట్గా జపాన్లో ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయింది . ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కి జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ ఈ మధ్యనే తిరిగి వచ్చి మళ్ళీ కన్నడ రజ్యోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు .

అయితే ఈ వేడుకలో అందరి దృష్టి ఎన్టీఆర్ పైనే పడింది. జూనియర్ ఎన్టీఆర్ కి సీఎం ప్రత్యేక ఆహ్వానం పంపించడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. కాగా ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులతో పాటు ఇన్ఫోసిస్ చైర్మన్ సుధామూర్తి కూడా హాజరయ్యారు . ఎన్టీఆర్ ని, సుధా మూర్తి ని ఒకే వేదికపై చూఇస్న జనాలు ఓ రేంజ్ లో హంగామా చేసారు. కాగా వేదికపై ఉన్న కుర్చీలో జూనియర్ ఎన్టీఆర్ ను నిర్వాహకులు కూర్చోమని కోరారు. కానీ ఎన్టీఆర్ అక్కడ ఉన్న మరో మహిళతో పాటు సుధా మూర్తికి ..తానే స్వయంగా కుర్చీలను తుడిచి కూర్చోబెట్టారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖచ్చితంగా ఆ స్థానంలో వేరే ఏ హీరో ఉన్నా ఇలా చేసే వాళ్ళు కాదు.. తమ పని తాము చూసుకొని వెళ్ళిపోయేవారు ..కానీ ఎన్టీఆర్ మహిళలకు తన కన్న వయసులో పెద్దవాళ్ళకి ఎలాంటి గౌరవం ఇస్తారో.. ఈ వీడియో ద్వారా మరోసారి ప్రూవ్ అయింది . దీంతో యంగ్ టైగర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దట్ ఇస్ ఎన్టీఆర్ అంటూ కామెంట్స్ చేస్తూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news