Moviesఅమ్మ కోసం ఆ పని చేయబోతున్న మహేశ్.. మరో సంచలన నిర్ణయం.....

అమ్మ కోసం ఆ పని చేయబోతున్న మహేశ్.. మరో సంచలన నిర్ణయం.. !?

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన మహేష్ బాబు ..ఆ తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . రాజకుమారుడు సినిమాలో మహేష్ బాబు నటన లుక్స్, ఫైట్స్, రొమాన్స్ ఎంత బాగా పండించారో మనకు తెలిసిందే. ఈ సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడుగా మారిపోయాడు. మహేష్ బాబు రాజకుమారుడు సినిమా టైంలో ఎలాంటి ఫిజిక్ హ్యాండ్ సమ్ లుక్ తో అదరగొట్టారో మనం చూసాం.

ఇప్పటికీ అలాంటి లుక్స్ తోనే మెస్మరైజ్ చేస్తున్నాడు . అంతేకాదు రీసెంట్ గా వచ్చిన సర్కారీ వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ..ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా అయిపోగానే దర్శకధీరుడు రాజమౌళితో సినిమాకి కమిట్ అయ్యాడు. కాగా రీసెంట్ గానే వాళ్ళ అమ్మగారు మరణించిన సంగతి తెలిసిందే .

అనారోగ్య కారణంగా మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ..కృష్ణ మొదటి భార్య మరణించారు. ఈ టైంలో మహేశ్ చాలా డిప్రెషన్ కి గురైయారు. ఫారిన్ కంట్రీస్ కి వెళ్లిపోయారు. ఈ మధ్యనే మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చారు . కాగా రీసెంట్గా మహేష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . తన అమ్మ ఆఖరి కోరిక ప్రకారం సితారకు ఓణీల ఫంక్షన్ చేయడానికి సిద్ధపడ్డాడు . మొదటి నుంచి సితారకు ఓణిల ఫంక్షన్ చేయడానికి మహేష్ బాబు కి ఇష్టం లేదట. కానీ అమ్మ ఆఖరి కోరిక కావడంతో ఆ పనికి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే మహేష్ బాబు ఇంట సితార ఓణీల ఫంక్షన్ జరగబోతున్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news