Moviesఅప్పుడు ప్రభాస్ ..ఇప్పుడు విజయ్.. ఇక పై అంతా జింతాత జిత...

అప్పుడు ప్రభాస్ ..ఇప్పుడు విజయ్.. ఇక పై అంతా జింతాత జిత జిత జింతాత తా..!!

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా బాహుబలి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ కొట్టలేదు. బాహుబలి తర్వాత వచ్చిన సాహూ ..ఆ తర్వాత గ్యాప్ తీసుకొని వచ్చిన రాధే శ్యామ్ రెండు డిజాస్టర్ గా మారి పరమ చెత్త టాక్ ను సంపాదించుకున్నాయి. ఈ క్రమంలోనే ఇంకా బాహుబలి పేరు చెప్పుకొని అవకాశాలు క్రేజ్ ను దక్కించుకుంటున్న ప్రభాస్ కచ్చితంగా నెక్స్ట్ సినిమా హిట్ కొడితేనే సినిమా ఇండస్ట్రీలో ఆయనకు గౌరవం అంటూ ఉంటుంది అంటూ జనాలు చెప్పుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ తన ఆశలన్నీ నెక్స్ట్ సినిమా సలార్ పై పెట్టుకొని ఉన్నాడు . ఈవెన్ ఆది పురుష్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నా సరే ఎక్కువ కాన్సెంట్రేషన్ సలార్ పై చేస్తూ హైప్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సలార్ గురించి కొత్త వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం సలార్ కూడా రెండు పార్ట్ లుగా తెరకెక్కించే విధంగా ప్లాన్ చేసుకున్నాడట ప్రశాంత్ నీల్.

కేజిఎఫ్ లాగే ఈ సినిమాను కూడా 2 పార్ట్స్ గా జనాల ముందుకు తీసుకు రావడం బెస్ట్ ఐడియా అని సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు . అయితే పార్ట్ వన్ లో ప్రభాస్ ని హైలెట్ గా చూపించబోతున్న ప్రశాంత్ పార్ట్ 2 లో విజయ్ దేవరకొండ ను హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ లో చూపించబోతున్నాడట. ఈ క్రమంలోని సలార్ ఫైనల్ షాట్ లో విజయ్ దేవరకొండ.. ప్రభాస్ తమ్ముడుగా ఎంట్రీస్ ఇవ్వబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. సలార్ క్లైమాక్స్ లో విజయ్ ని పరిచయం చేసి ఆ తర్వాత సలార్ 2 లో కీలకమైన మెయిన్ లీడ్ లో విజయ్ దేవరకొండను చూపించబోతున్నాడు అంటూ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఒకవేళ ఇది నిజమైతే కచ్చితంగా బాహుబలి ని మించిన రికార్డ్ ప్రభాస్ ఖాతాలో పడినట్టే అంటున్నారు ఫ్యాన్స్ . చూడాలి మరి ఏం జరగబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news