Moviesనానమ్మ ఆత్మకు శాంతి ..సితార పాప ఏం చేసిందో తెలుసా.. దండం...

నానమ్మ ఆత్మకు శాంతి ..సితార పాప ఏం చేసిందో తెలుసా.. దండం పెట్టేసిన మహేష్ బాబు..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ సినిమాలో చేస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఒకప్పటి స్టార్ హీరో . ఇక ఆయన వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన మహేష్ బాబు కూడా తండ్రికి మించిపోయే సేవతో, యాక్టింగ్ తో జనాలను ఆకట్టుకున్నాడు . మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న ప్రజాసేవ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సహాయం అని అడగక ముందే బాధలో ఉన్న వాళ్లకు సహాయం చేయడం మహేష్ బాబు స్పెషాలిటీ .

ఆ గుణం ఆయనకి సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుంచి వచ్చింది . కాగా ఇప్పుడు మూడో తరం జనరేషన్లో సితార పాప ఆ బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తుంది . మనకు తెలిసిందే సితార పాపకు సోషల్ మీడియాలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .మహేష్ బాబు కూతురుగానే కాదు మంచి అమ్మాయిగా కూడా సితార సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. కాగా రీసెంట్గా మహేష్ మదర్ ఇందిరా దేవి గారు మరణించిన సంగతి తెలిసిందే .

ఆ టైంలో సితార నానమ్మ పార్ధివ దేహం వద్ద విలపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నానమ్మ ఇక లేరు అన్న బాధను ఆమె తట్టుకోలేక వెక్కివెక్కి ఏడుస్తూ తల్లిదండ్రులను పట్టుకొని బాధపడింది . కాగా ఇప్పుడు రీసెంట్గా నానమ్మ కోసం సితార పాప సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందిరాదేవి పేరు మీద నిత్యం వెయ్యి మందికి అన్నదానం చేసేటట్లు ప్లాన్ చేసుకుందట. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ..దీనికోసం సితార పాప ఒక్క రూపాయి కూడా మహేష్ బాబును కానీ సూపర్ స్టార్ కృష్ణని అడగడం లేదట.

తన సొంతంగా సోషల్ మీడియాలో వచ్చిన డబ్బుల ద్వారా.. తన అన్నయ్య గౌతమ్ హెల్ప్ తీసుకొని ఈ కార్యక్రమానికి పూనుకునిందట . ఇది నిజంగా గ్రేట్ అని చెప్పాలి . ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద మనసు ఎలా వచ్చింది వీళ్ళకి అంటూ జనాలు షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా సరే ఇంత చిన్న వయసులో అన్న చెల్లెలు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news