Moviesనాగార్జున - బాల‌కృష్ణ మ‌ధ్య గొడ‌వ ఎందుకు... ఏం జ‌రిగింది...!

నాగార్జున – బాల‌కృష్ణ మ‌ధ్య గొడ‌వ ఎందుకు… ఏం జ‌రిగింది…!

టాలీవుడ్ లెజెండ్రీ హీరోల వార‌సులు అయిన నంద‌మూరి బాల‌కృష్ణ‌, అక్కినేని నాగార్జున మ‌ధ్య ఒక‌ప్పుడు మంచి స్నేహ‌మే ఉండేది. ఇద్ద‌రు లెజెండ్రీ దిగ్గ‌జాల త‌న‌యులు, వారి వార‌స‌త్వాన్ని నిల‌పెట్టే వారు కావ‌డంతో ఇద్ద‌రూ పోటాపోటీగా సినిమాలు చేసేవారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసేవారు. ఇద్ద‌రూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య చిన్న చిన్న అభిప్రాయ బేధాలు ఉన్నా త‌ర్వాత క‌లిసిపోయేవారు. అయితే బాల‌య్య – నాగార్జున ప‌దేళ్ల ముందు వ‌ర‌కు బాగానే ఉన్నా త‌ర్వాత వీరి మ‌ధ్య గ్యాప్ పెరిగింది.

నాగార్జున ముందు నుంచి ఎక్కువుగా చిరంజీవితో క్లోజ్‌గా ఉండేవారు. చిరుతో వ్యాపార భాగ‌స్వామిగా కూడా ఉన్నాడు. ఇక నాగార్జున పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య‌ను హీరోగా ప‌రిచ‌యం చేసిన‌ప్పుడు కూడా బాల‌య్య వ‌చ్చి చైతును స్టార్ హీరో అవ్వాల‌ని ఆకాంక్షించ‌డంతో పాటు దీవించారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య ఎక్క‌డో గ్యాప్ వ‌చ్చింది. ఏఎన్నార్ జీవిత‌కాల సాఫ‌ల్య పుర‌స్కారాల ప్ర‌క‌ట‌న‌లో నాగార్జున ఇండ‌స్ట్రీలో ప్ర‌ముఖులు అంద‌రిని ఆహ్వానించి బాల‌య్య‌ను మ‌ర్చిపోయారు.

ఇది బాల‌య్య‌లో కోపానికి కార‌ణ‌మైంది. త‌ర్వాత నాగ్ స్వ‌యంగా బాల‌య్య ఇంటికి వెళ్లి బ‌తిమిలాడినా ప‌ట్టించుకోలేదంటారు. త‌న‌ను నాగ్ మ‌ర్చిపోవ‌డం బాల‌య్య మ‌న‌స్సును బాధ‌పెట్టింద‌ని అంటారు. ఆ త‌ర్వాత నాగ్ మెగా కాంపౌండ్‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. అయితే ఏఎన్నార్ ఓపెన్‌హార్ట్ ఆర్కే ప్రోగ్రామ్‌లో ఎన్టీఆర్‌ను ఆవేశ‌ప‌రుడు అన‌డంతో పాటు త‌న‌పై కొంద‌రు చెప్పిన మాట‌లు విని ఇబ్బంది పెట్టార‌న్న‌ట్టుగా మాట్లాడారు. చ‌నిపోయిన వ్య‌క్తి.. అందులోనూ తాను సోద‌ర స‌మానుడిగా భావించిన ఎన్టీఆర్ గురించి ఏఎన్నార్ అలా మాట్లాడ‌డం బాల‌య్య‌కు న‌చ్చలేదంటారు.

కార‌ణాలు ఏవైనా ఏఎన్నార్ చ‌నిపోయిన‌ప్పుడు బాల‌య్య వెళ్ల‌లేదు. చైతును లాంచ్ చేసిన‌ప్పుడు వెళ్లి దీవించిన బాల‌య్య అఖిల్ లాంచింగ్ అప్పుడు వెళ్ల‌లేదు.. నాగార్జున పిల‌వ‌నూ లేదు. ఇక అఖిల్ మొద‌టి సినిమా ప్లాప్ అయిన‌ప్పుడు బాల‌య్య‌ను కొంద‌రు విలేక‌ర్లు మీ అబ్బాయి ఎప్పుడు సినిమాల్లోకి వ‌స్తున్నార‌ని ప్ర‌శ్నించారు. అప్పుడు బాల‌య్య మా అబ్బాయి మొద‌టి సినిమాలోనే ప్ర‌పంచాన్ని ర‌క్షించే పాత్ర‌లు వేయ‌డ‌ని చెప్పారు. అది అఖిల్ సినిమాలో అఖిల్ పాత్ర కావ‌డంతో.. కావాల‌నే కౌంట‌ర్ వేశార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

ఇక సోష‌ల్ మీడియాలో కూడా నాగ్ మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు, బిగ్‌బాస్ హోస్ట్ చేయ‌డం… అటు బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోను కంపేరిజ‌న్ చేయ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఇద్ద‌రు అభిమానుల మ‌ధ్య కూడా స‌ఖ్య‌త లేదు. అయితే సుబ్బ‌రామిరెడ్డి వైజాగ్‌లో నిర్వ‌హించిన ఫంక్ష‌న్లో బాల‌య్య బ‌హిరంగంగానే ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో కొంత‌కాలంగా బాల‌య్య‌కు, నాకు మ‌ధ్య ఏదో జ‌రుగుతుంద‌న్న ప్ర‌చారం ఉంద‌ని.. అదంతా అబ‌ద్ధం అంటూ బాల‌య్య చేతిలో చేయి వేసి మ‌రీ క్లారిటీ ఇచ్చారు. బాల‌య్య కూడా అవును అన్న‌ట్టుగా త‌లూపారు. ఆ టైం వ‌ర‌కు వీరు త‌మ మ‌ధ్య గ్యాప్ లేద‌ని చెప్పినా త‌ర్వాత క‌లుసుకుని.. అప్యాయ‌త‌గా మాట్లాడుకున్న దాఖ‌లాలు అయితే లేవు. మొత్తానికి ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ల మ‌ధ్య ఏదో తెలియ‌ని చిన్న గ్యాప్ అయితే క‌న‌ప‌డుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news