Moviesఅమ్మ మరణం తరువాత అలాంటి పని..ప్రతి తల్లి గర్వపడేలా చేసిన మహేశ్...

అమ్మ మరణం తరువాత అలాంటి పని..ప్రతి తల్లి గర్వపడేలా చేసిన మహేశ్ బాబు ..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గారు ఈ మధ్యనే మరణించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా బాధపడుతున్న ఇందిరాదేవి గారు సడెన్ గా ఇలా మరణించడం ఘట్టమనేని ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విషయమైంది . ఇందిరా దేవి మరణాన్ని సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికి ఆమె తమ మధ్య ఉంది అనుకొని భ్రమ పడుతున్నారు . కాగా మహేష్ బాబు మాత్రం తల్లి మరణం తర్వాత తీవ్రంగా కృంగిపోతున్నారట.

ఫుడ్ తినకుండా ..అమ్మ జ్ఞాపకాలని తలుచుకుంటూ.. రూమ్ లో నుంచి బయటకు రావట్లేదట . ఈ క్రమంలోనే ఇది తెలుసుకున్న ఘట్టమనేని ఫ్యాన్స్ చాలా బాధపడిపోతున్నారు. మహేష్ నీకు మేమున్నాము అంటూ ధైర్యం చెప్తున్నారు. కానీ ఎంతమంది ఉన్న అమ్మ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు . అది అందరికీ తెలిసిందే . కాగా మహేష్ బాబు తన తల్లి కోసం తన తల్లి జ్ఞాపకాలు తనతో ఎప్పుడూ ఉండడం కోసం ఆయన తన అమ్మగారు ఎంతో ఇష్టపడి మరి చేయించుకున్న మంచాన్ని తన రూమ్ లోకి షిఫ్ట్ చేయించుకున్నారట.

ఎస్ తాజాగా ఘటమనేని కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు వాళ్ళ అమ్మగారికి సంబంధించిన కొన్ని వస్తువులను తనతో ఎప్పటికీ ఉంచుకునేలా తన బెడ్ రూమ్లో సెట్ చేసుకున్నారట. అంతేకాదు అమ్మ ఫోటోని బెడ్రూంలో పెద్దదిగా చేయించుకొని పెట్టుకున్నారట. నిద్ర లేవగానే అమ్మ ముఖం చూడాలని ఎప్పుడు అమ్మ తనతోనే ఉందన్న ఫీలింగ్ కలుగుతుందని ఆయన అనుకుంటున్నారట. ఏది ఏమైనా ఇంత స్టార్ హీరో స్టేటస్ కలిగి ఉన్నా కానీ మహేష్ బాబు చిన్న చిన్న హ్యాపీనెస్లు కోరుకుంటూ అమ్మ కోసం ఇలాంటి పనిచేయడం ప్రతి తల్లి గర్వపడే విషయమని అంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. కాగా త్వరలోనే ఎస్ ఎస్ ఎం బి 28 సినిమా షూటింగ్ను ప్రారంభించబోతున్నారు. దివాళి కానుకగా ఈ సినిమా టైటిల్ ని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news