Moviesదివాళి రోజున ప్రభాస్ పెద్దమ్మ చేసిన పనికి అంతా షాక్..నిజమైన ప్రేమ...

దివాళి రోజున ప్రభాస్ పెద్దమ్మ చేసిన పనికి అంతా షాక్..నిజమైన ప్రేమ అంటే ఇదేగా..!!

రీసెంట్ గానే ప్రభాస్ పెదనాన్న టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే . అనారోగ్య కారణంగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కృష్ణం రాజు వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఈ ఊహించని పరిణామంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. రాజకీయ నేతల ముఖాలలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా కృష్ణంరాజు మరణించి ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఇంకా ప్రభాస్ ఆ మరణ విషాదఛాయాల నుంచి బయటికి రాలేదు.

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూడా కృష్ణంరాజు లేరు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు . ఇప్పటికి ఆయన తనతోనే ఉన్నాడు అనుకోని ఆయన ఇష్టంగా పెంచుకున్న కుక్కను దగ్గరగా చూసుకుంటూ బ్రతుకుతుంది . ఆమె బిహేవియర్ ఇంట్లో వాళ్లకి షాకింగ్ అనిపిస్తుంది. మనకు తెలిసిందే రెబెల్ ఫ్యామిలీ ఎప్పుడు గ్రాండ్గా దివాళిని సెలబ్రేట్ చేసుకుంటుంది. కానీ ఈసారి రెబల్ ఫ్యామిలీ దివాళికి దూరంగా ఉండింది. కృష్ణంరాజు మరణంతో రెబల్ ఫ్యామిలీ దివాళి సంబరాలు జరుపుకోలేదు.

అయితే శ్యామలాదేవి మాత్రం కృష్ణంరాజుకు ఇష్టమైన వంటకాలన్నీ స్వయాన తన చేతులతోనే చేసి పెట్టి ఆయన రూమ్ వద్ద పెట్టిందట .కృష్ణంరాజు ఆ రూమ్ లో ఉన్నాడని.. కచ్చితంగా భోజనాలను ఆరగిస్తాడని అని చెప్పి ఆయన రూమ్ లోకి వెళ్లి అన్నం వడ్డించి.. నా భర్త తింటున్నాడు అంటూ అందరికీ చెప్పుతూ సంబర పడ్డిందట. దీంతో ఒక్కసారిగా షాక్ అయినా వాళ్ళ కూతుర్లు అమ్మకు ఏమైంది అంటూ బాధపడిపోతున్నారు. అంతేకాదు ప్రభాస్ సైతం శ్యామలాదేవి ని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడట. ఏది ఏమైనా సరే కృష్ణంరాజు ఇలా అందరిని ఒంటరి చేసి వెళ్లిపోవడం తన కుటుంబానికి కే కాదు సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news