Moviesమహేశ్ బాబు నటించిన ఆ ఒక్క సినిమాను..ఎకంగా 100సార్లు చూసిన ఇందిరదేవి.....

మహేశ్ బాబు నటించిన ఆ ఒక్క సినిమాను..ఎకంగా 100సార్లు చూసిన ఇందిరదేవి.. చూసిన ప్రతిసారి ఏడుపు..!!

మనకు తెలిసిందే రీసెంట్గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు ఇందిరాదేవి అనారోగ్య కారణంగా మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా ఘట్టమనేని ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. మహేష్ బాబుకు వాళ్ళ అమ్మగారుతో ప్రత్యేకమైన అటాచ్ మెంట్ ఉంది. చిన్నప్పటి నుంచి మహేష్ బాబుకు వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం . కాగా ఇప్పటికీ మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు చనిపోయిన బాధనుండి బయటకు రాలేకపోతున్నారు . ఇదే విషయాన్ని పరుచూరి గోపాలకృష్ణ గారు కూడా ఓ వీడియోలో చెప్పుకొచ్చారు . ఇప్పటివరకు మహేష్ బాబు అంత శాడ్ గా ఉన్న ఫేస్ నేనెప్పుడూ చూడలేదని .. ఆయన పెదాలపై చిరునవ్వు మిస్ అయిందని.. దానికి కారణం వాళ్ళ అమ్మగారు అని చెప్పుకొని బాధపడ్డారు.

కాగా ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. మహేష్ బాబు నటించిన సినిమాల్లో వాళ్ళ అమ్మగారు ఓ సినిమా అని ఏకంగా వందసార్లు కు పైగానే చూశారట. ఆ సినిమా మరేదో కాదు స్టార్ డైరెక్టర్ తేజ డైరెక్షన్ లో వచ్చిన నిజం సినిమా . నిజానికి ఈ సినిమా మహేష్ బాబు అభిమానులకు పెద్దగా నచ్చదు ..చెప్పుకోతగా హిట్ కూడా అవ్వలేదు . కానీ మహేష్ బాబు వాళ్ళ అమ్మగారికి మాత్రం ఈ సినిమా అంటే చాలా ఇష్టమట. ఈ సినిమాలో అమ్మ మాట విన్న కొడుకుగా సైలెంట్ లుక్స్ లో చాలా అమాయకంగా తన కొడుకు కనిపించాడని చెప్పుకొని మురిసిపోయేదట.

అంతేకాదు తను ఎప్పుడు సినిమా చూడాలనిపించిన మొదట నిజం సినిమానే పెట్టమంటూ అడిగి మరి ఆ సినిమాను పెట్టుకొని చూసేదట . ఆఖరికి ఆమె చనిపోయే ఓ నెల రోజుల ముందు కూడా ఈ సినిమాను చూసిందట . దీని బట్టి చెప్పచ్చు మహేష్ బాబు వాళ్ళ అమ్మగారికి ఈ సినిమా అంటే ఎంత ఇష్టమో. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు చాలా సైలెంట్ లుక్స్ తో అమ్మ మాట విన్న కుర్రాడిగా సైలెంట్ గా.. నిజాన్ని నిజాయితీగా ప్రూవ్ చేసి నిజమైన హీరో అనిపించుకున్నాడు. ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో గోపీచంద్ నటన సినిమాకు మరింత హైలెట్గా మారింది. మరి ముఖ్యంగా సిబిఐ ఆఫీసర్ పాత్రలో ప్రకాష్ రాజ్ జనాలని మెప్పించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news