Moviesహవ్వ..స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆ హీరోయిన్ ని వాడుకుని వదిలేశాడా..?

హవ్వ..స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆ హీరోయిన్ ని వాడుకుని వదిలేశాడా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు వాడుకోవడం సర్వసాధారణం. అయితే శేఖర్ కమ్ములా అలాంటి జోన్ లోకి రాడు . తన పని తాను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సినిమా తీశామా.. హిట్ కొట్టామా.. అవార్డు పట్టుకున్నామా ..అంతే . మిగతా కంటెంట్ విషయాలు.. మిగతా గోల విషయాలు ..ఆయనకు అనవసరం. ఏ ఫంక్షన్లకి రాడు.. ఏ మీటింగ్లకు అటెండ్ అవ్వడు.. వచ్చిన మాట్లాడడు తన పని తనది ..తన సినిమా తనది ..తన సినిమా కోసం ప్రమోషన్ చేసే టైంలో తప్పిస్తే శేఖర్ కమ్ములను బయట మనం ఎప్పుడూ చూడలేం. అలాంటి ఓ స్పెషల్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తి సినీ ఇండస్ట్రీలో ఉండటం నిజంగా గ్రేట్.

అయితే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. అదే ఫ్యామిలీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని వాడుకుని వదిలేశారు. ఇదే న్యూస్ ఇప్పుడు టాప్ ట్రెండిం లో దూసుకుపోతుంది. వాడుకొని వదిలేసారు అంటే తప్పుగా అర్థం చేసుకునేరు. అందరు డైరెక్టర్స్ క్యాస్టింగ్ కౌచ్ కి ఇష్టపడరు. కొందరు టాలెంట్ చూసి కూడా సినిమాలో అవకాశం ఇస్తారు.. అలాంటి వారిలో ఒకరే శేఖర్ కమ్ముల. ఆడవాళ్లను తప్పు దృష్టితో చూడడు ఈయన.

మనకు తెలిసిందే శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సాయి పల్లవి రెండు సినిమాల్లో నటించింది. ఒకటి ఫిదా ఈ సినిమాతోనే ఆమె తెలుగులో సినీ ఎంట్రీ ఇచ్చింది . మెగావారసుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాతోనే సాయి పల్లవి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ సాయి పల్లవి నటనకు ఫిదా అయిపోయింది .

మరి ముఖ్యంగా ఆమె డాన్స్ చూసిన స్టార్స్ మంత్రముగ్ధులు అయిపోయారు. ఇక తర్వాత లవ్ స్టోరీ అంటూ నాగచైతన్యతో మరో సినిమా చేసింది.. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగు బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగరాసింది లవ్ స్టోరీ సినిమా. అయితే ముచ్చటగా మూడోసారి ధనుష్ తో తీస్తున్న సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని పెట్టబోతున్నారు అంటూ టాక్ వినిపించింది . మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్టర్ గా చేస్తున్న తెలుగు మూవీ నే డైరెక్ట్ చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల.

ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ అంటూ ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, సాయి పల్లవిని ఈ సినిమా నుంచి డైరెక్టర్ తీసేసిన్నట్లు ఓ టాక్ బయటకు వచ్చింది . దీంతో అందరూ సాయి పల్లవి ని ఈయన వాడుకున్నన్ని రోజులు వాడుకున్నారని ఇప్పుడు ఆమె సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఆమెకు హ్యాండ్ ఇచ్చాడని.. అందరి డైరెక్టర్ లాగే శేఖర్ కమ్ముల కూడా రంగులు మార్చే ఊసరవెల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news