Moviesసాయి పల్లవి చేసిన పనికి చెంప పగలకొట్టిన పేరంట్స్..ఇండస్ట్రీ షాక్..!?

సాయి పల్లవి చేసిన పనికి చెంప పగలకొట్టిన పేరంట్స్..ఇండస్ట్రీ షాక్..!?

సాయి పల్లవి ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలోకి “మలర్” అనే సినిమాతో హీరోయిన్ గా ఎంటర్ అయిన సాయి పల్లవి.. ఆ తర్వాత తెలుగులో ఫిదా అనే సినిమాతో జనాలను ఫిదా చేసింది. అంతేకాదు సాయి పల్లవి నటన యాక్టింగ్ స్టైల్ జెన్యూనిటీ క్రమశిక్షణ పంచువాలిటీ అంటే సినీ ఇండస్ట్రీలో చాలామందికి ఇష్టం.

సాయి పల్లవి అంటే జనాల్లో విపరీతమైన ఓ క్రేజ్ ఉంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది.. ఫేస్ మీద చెబుతుంది అనే ఓ మంచి పేరు తనపై వచ్చేలా చేసుకుంది . అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయి పల్లవి తన పేరెంట్స్ తనను కొట్టారని చెప్పుకొచ్చింది .దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ షాక్ అయిపోయింది. అంత మంచి హీరోయిన్ సాయి పల్లవిని పేరెంట్స్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది అంటూ మాట్లాడుకుంటున్నారు.

కాగా దానికి కారణం సాయి పల్లవి చేసిన పని అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. సౌత్ ఇండస్ట్రీలో కేవలం నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. కాగా ఈ మధ్యనే సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా రిలీజ్ అయి ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించిన విషయం గురించి మీడియాతో పంచుకునింది. విరాట పర్వంలో హీరోకి లెటర్ రాసే సీన్ కి తను నిజంగానే కనెక్ట్ అయ్యానని ..

నిజజీవితంలో ఓ అబ్బాయికి ప్రేమలేఖ రాశానని బయటపెట్టింది. దాంతో తల్లిదండ్రులు ఆమెను బాగా కొట్టారని.. ఆమె చాలా ఏడ్చినట్లు కూడా చెప్పుకొచ్చింది. అప్పుడు ఆమె 7వ క్లాస్ చదువుతుందట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యపోయారు. దీంతో సాయి పల్లవి ఏడవ తరగతి లోనే ప్రేమలేఖ రాసిందా..? అంటూ షాక్ అవుతున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news