Moviesనాకు ఇష్టం లేకుండానే ఆ పని చేశా.. ఫస్ట్ టైం తప్పు...

నాకు ఇష్టం లేకుండానే ఆ పని చేశా.. ఫస్ట్ టైం తప్పు ఒప్పుకున్న ప్రియమణి..!

టాలీవుడ్ లో ప్రియ‌మ‌ణి రెండు దశాబ్దాల అనుబంధం. నిర్మాత కేఎస్ రామారావు తనయుడు హీరోగా వచ్చిన ఎవరి అతగాడు సినిమాతో ప్రియ‌మణి టాలీవుడ్ తెరకు పరిచయం అయింది. కన్నడ అమ్మాయి అయినా ప్రియ‌మణి తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో సినిమాలో జగపతిబాబుకు జోడిగా నటించింది. ఈ సినిమాలో జగపతిబాబుతో ఢీ అంటే ఢీ అనే పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడిగా యమదొంగ సినిమాలో నటించడంతో ప్రియ‌మణికి మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. నితిన్ ద్రోణ‌ సినిమాలో ప్రియమణి ఏకంగా బికినీతో నటించి కుర్ర కారుకు మంచి కిక్ ఇచ్చింది. తెలుగుతో పాటు అటు తమిళంలోనూ సినిమాలు చేసింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్లి పీటలు ఎక్కేసింది. త‌న ప్రియుడు ముస్తాఫా రాజ్‌ను పెళ్లాడింది. ప్రియమణికి పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గినా సీనియర్ హీరోల సినిమాలతో పాటు.. మంచి కథాబలం ఉన్న సినిమాల్లో నటిస్తోంది.

అలాగే బుల్లితెరపై షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. అయితే ప్రియమణి కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అనుభవాలను తన తాజా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది. ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఓ సన్నివేశంలో తన నాభి చూపించే సీను ఉందని… నాభి దగ్గర టాటూ చూపిస్తూ ఆ సీన్ చేయాల్సి ఉందని ప్రియమణి గుర్తుచేసుకుంది.

అయితే తనకు ముందుగా ఆ సీన్ గురించి చెప్పలేదని.. అయినా తాను నాభి చూపించే సీన్ చేశానని చెప్పుకొచ్చింది. కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా కూడా ఇలా అందాలు చూపించాల్సి రావటంతో ఇబ్బందులు తప్పవని ప్రియమణి చెప్పింది. ఇక ప్రియమణి రీసెంట్‌గా తెలుగులో విక్ట‌రీ వెంకటేష్ నారప్ప, రానా విరాట‌ప‌ర్వం సినిమాల‌లో నటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news