Moviesఇండస్ట్రీలో ఎవ్వరు తోపు కాదు.. అందరికి కావాల్సింది అదే..పూజా హెగ్డే సంచలన...

ఇండస్ట్రీలో ఎవ్వరు తోపు కాదు.. అందరికి కావాల్సింది అదే..పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు..!!

సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు.. పొజిషన్స్ కూడా మారుతూ ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. పాపం ఈ విషయాన్ని లేట్ గా అర్థం చేసుకుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఎవరు పొజిషన్ శాశ్వతం కాదు అని ఏ హీరో హీరోయిన్లు తోపు కాదు అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.

కెరియర్ మొదట్లో ఓ సినిమా హిట్ కొట్టడానికి చాలా టైం తీసుకున్న పూజ ఆ తర్వాత అరవింద వీరరాఘవ సమేత సినిమాతో మొదటి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత తన కెరియర్ను వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో ..తన ఖాతాను నింపేసుకుంది. అయితే గతంలో ఆమెను ఐరన్ లెగ్ అంటూ నిందించిన వాళ్లు మళ్లీ అదే ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు .దానికి కారణం రీసెంట్ గా ఆమె నటించి రిలీజ్ అయిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ కావడమే.

అయితే రీసెంట్ గా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజ హెగ్డే మాట్లాడుతూ ..సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ..” సినీ ఇండస్ట్రీలో పరిస్థితిలో ఎప్పుడు ఒకేలాగా ఉండవు.. ఎవరి స్థానం శాశ్వతం కాదు… సినిమా హిట్ అయితే చప్పట్లు కొట్టి.. ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అంటూ ఎగబడే జనాలు ఫ్రెండ్స్…. ఒక్క సినిమా ఫ్లాప్ అవ్వగానే మనం ఫోన్ చేసిన లిఫ్ట్ చేయరు. మనం ఎవరో తెలియనట్టుగా పట్టించుకోకుండా పోతారు . ఈ విషయం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అందుకే నా సినిమా రిలీజ్ అవుతుందంటే ఎందుకో నాకు ఇప్పుడు కంగారుగా ఉంది ..ఆ రోజు నా ఫోన్ మోగిందంటే నా జాతకం బాగున్నట్టే ..ఫోన్ మోగలేదా నా సినిమా ఫ్లాప్ అయినట్టే అని అర్థం చేసుకుంటాను”.. అంటూ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది బుట్టబొమ్మ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news