Movies# NBK 109 పూరితో ఫిక్స్ ... ఎమోష‌న‌ల్ స్టోరీలో బాల‌య్య...

# NBK 109 పూరితో ఫిక్స్ … ఎమోష‌న‌ల్ స్టోరీలో బాల‌య్య డ్యూయెల్ రోల్‌…!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ `అఖండ` సినిమా తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నాడు. ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసే సినిమాలో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల‌ బాలయ్యకు కూతురుగా నటిస్తోంది. బాలయ్య 55 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి పాత్రలో కనిపిస్తున్నాడు. అనిల్ రావిపూడి సినిమా తర్వాత బాలయ్య ఏ దర్శకుడితో కమిట్ అవుతాడు అన్నదానపై కొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.

పూరి జగన్నాథ్ – బోయపాటి శ్రీను లైన్ లో ఉన్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బాలయ్య 109వ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో `పైసా వసూల్` సినిమా వచ్చింది. ఈ సినిమా అంచనాలు అందుకో లేకపోయినా బాలయ్యను ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేసింది. సినిమాలో బాలయ్య లుక్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ చాలా కొత్తగా కనిపించింది. పైగా బాలయ్య `పైసా వసూల్` సినిమాలో `మామ ఏక్ పెగలా అనే పాట పాడి` అందరిని అలరించాడు. పైసా వసూల్ తర్వాత మరోసారి పూరీతో చేసేందుకు బాలయ్య ఉత్సాహంగానే ఉన్నాడు.

తనను గత సినిమాలు కంటే చాలా కొత్తగా ప్రజెంట్ చేసిన తీరు బాలయ్యకు బాగా నచ్చేసింది. అందుకే `పైసా వసూల్` రిలీజ్ అయ్యాక వెంటనే నీకు మరో ఛాన్స్ ఇస్తున్నానని బాలయ్య పూరితో చెప్పేశారు. అప్పటినుంచి ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉన్నారు. తాజాగా విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ తీసిన పాన్ ఇండియా సినిమా `లైగ‌ర్` డిజాస్టర్ అయింది. ఈ సినిమా దెబ్బతో పూరి ఒక్కసారిగా డీలా పడ్డాడు. ప్రస్తుతం పూరి ఉన్న పరిస్థితుల్లో పూరితో సినిమా చేసేందుకు ఏ హీరో కూడా ఇష్టపడటం లేదు. అందుకే విజయ్ దేవరకొండతో పూరి చేయాల్సిన `జనగణమన` ప్రాజెక్టు కూడా మధ్యలోనే ఆగిపోయింది.

 

ఈ క్రమంలోనే పూరి తన కుమారుడు ఆకాష్ తో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పూరితో పాటు ఆయన టీం గోవాలో క్యాంపు వేసుకొని మరీ స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ స్క్రిప్టు బాలయ్య కోసమే రాస్తున్నాడట‌. అన్ని కుదిరితే సీ కళ్యాణ్‌ బ్యానర్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. బాలయ్య కోసం పూరి ఓ ఎమోషనల్ యాక్షన్ స్టోరీ రాస్తున్నాడట.

తండ్రి కొడుకుల నేపథ్యంలో సాగే ఈ కథ రవితేజ హీరోగా వచ్చిన `ఇడియట్` సినిమాకి కొనసాగింపుగా ఉంటుందని.. అయితే ఇది ఇడియట్ లా యూత్ కి అయ్యే కనెక్ట్ స్టోరీ కాకుండా మెచ్యూర్ స్టోరీ అని అంటున్నారు. తన కొడుకు గెలుపు కోసం తండ్రి ఏం చేశాడు ? అన్నదే ఈ సినిమాలో మెయిన్ స్టోరీ అని… సినిమాలో ఎమోషన్ ఉన్న మెయిన్ గా యాక్షన్ బేస్‌డ్ గానే ఉంటుందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news