Moviesఅమ్మ చివరి కోరికను తీర్చలేకపొయిన మహేష్ బాబు..చాలా బాధపడ్డిందట..!?

అమ్మ చివరి కోరికను తీర్చలేకపొయిన మహేష్ బాబు..చాలా బాధపడ్డిందట..!?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ..మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు ఇందిరా దేవి నిన్న మరణించిన సంగతి తెలిసిందే. 70 ఏళ్ల ఇందిరాదేవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో జన్మించింది. దీంతో ఆమె స్వస్థలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇందిరా దేవి కృష్ణను పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టాక రమేష్ బాబు మహేష్ బాబులతో తరచుగా తన ఊరు ముసలిమడుగు వెళ్లి వచ్చేదట . ఆమె ఎప్పుడు వచ్చిన అందర్నీ ఆప్యాయంగా పలకరించేదని చాలా మంచి మనసు ఉన్న ఆవిడని అక్కడ ఉండే వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇలాంటి మంచి మనసు ఉన్న ఆమె ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం బాధను కలిగిస్తుందని ఆమె బంధువులు చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు ఇప్పటికీ ముసలిమడుగు లో ఇందిరాదేవి పేరట ఇల్లు ఉందని అక్కడ ఉండే జనాలు చెప్పుకొచ్చారు. కాగా ఇందిరా దేవి చాలా సైలెంట్ గా ఉండే వారిని ఎవరితో ఎక్కువగా మాట్లాడరని.. కానీ మన అనుకుంటే ఆమె చాలా ఆప్యాయంగా చూసుకుంటారని అక్కడ ఉండే జనాలు చెప్తూ వచ్చారు. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఇందిరాదేవికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఆమె లాస్ట్ రోజుల్లో మహేష్ బాబు కూతురు సితారకు ఓణీల ఫంక్షన్ చేయమని కోరిందట.

కానీ అలాంటి ఫంక్షన్స్ ఇష్టపడని మహేష్ బాబు అమ్మతో ఇలాంటివన్నీ నాకు నచ్చవు అంటూ తెగ్గేసి చెప్పాడట. అంతేకాదు ఆమె ఇది నా చివరి కోరిక కనీసం నా కళ్ళముందైన సీతార పాపకు పరికిణి ఓణీలో చూడాలని ఉంది అంటు కోరిందట. అయినా కానీ మహేష్ బాబు దానికి ఒప్పుకోలేదట . దీంతో ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం అంటూ ఆ అమ్మ కోరికను నెగ్లెట్ చేశారట . ఇక తీరా ఆమె చనిపోయాక ఆ విషయం తలుచుకొని చాలా బాధపడ్డారట మహేష్ బాబు. అంతేకాదు సితార కూడా ఈ విషయంలో బాధపడుతున్నట్లు తెలుస్తుంది . నానమ్మ పార్థివ దేహం వద్ద సితార బోరుమని ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనకు తెలిసిందే. ఈ విధంగా అమ్మ కోరికను తీర్చలేకపోయాడు మహేష్ బాబు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news