Moviesపుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఊరటనిచ్చే వార్త..కూల్ అవుతారా..?

పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఊరటనిచ్చే వార్త..కూల్ అవుతారా..?

గత రెండు రోజులుగా సినీ పరిశ్రమ కృష్ణం రాజు మరణ వార్తతో తీవ్ర శోకసంద్రంలో నిండిపోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ లెజెండ్రీ యాక్టర్ కృష్ణం రాజు అనారోగ్య కారణంగా ఆదివారం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఊహించని షాకింగ్ వార్త విన్న అభిమానులు తీవ్ర చాలా బాధపడ్డారు. మరీ ముఖ్యంగా కృష్ణం రాజు అంత్యక్రియలలో ప్రభాస్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో రెబల్ అభిమానులను కూడా కంటతడి పెట్టిస్తున్నాయి.

ఈ క్రమంలోనే నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు కనక మామిడి ఫాం హౌస్ లో కృష్ణం రాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రజెంట్ కృష్ణంరాజు ముగ్గురు కూతుర్ల బాధ్యత ప్రభాస్ పైనే పడింది .దీంతో ఇంటికి పెద్ద దిక్కుగా మారాడు ప్రభాస్. అయితే గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. కృష్ణం రాజు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ స్టార్ సెలబ్రిటీస్ ట్వీట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియా వేదికగా కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు.

ఇలాంటి క్రమంలోనే రెబల్ ఫ్యాన్స్ కు కాస్త ఊరట ను ఇచ్చే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఎస్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి అరుదైన గౌరవం దక్క బోతుంది . మనకు తెలిసిందే దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రామ్ లీలా మైదానంలో ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా వైభవంగా నిర్వహిస్తారు. కాగా ఈ ఉత్సవాలలో చివరి రోజున రావణాసుర దహన కార్యక్రమం ఉంటుంది. ప్రతిసారి ఈ కార్యక్రమానికి ఓ స్పెషల్ గెస్ట్ ని పిలిచి సెలబ్రిటీస్ దగ్గర రావణ దహనం చేయిస్తారు. ఈ సంవత్సరం స్పెషల్ గౌరవాన్ని అందుకోబోతున్నాడు ప్రభాస్ .ఇప్పటికే దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రభాస్ కి అందినట్లు తెలుస్తోంది . కాగా ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష చిత్రంలో శ్రీరాముడుగా నటిస్తున్నాడు .అందుకే ఈయన రావణ దహన కార్యక్రమం చేస్తే మరింత బాగుంటుందని కమిటీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రోగ్రాం కి ప్రభాస్ వెళ్తాడా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news