Moviesఅడిగి మరి ఆ సింగర్ తో తన సినిమాలో పాటపాడించుకున్న బన్ని..ఎందుకంటే..!?

అడిగి మరి ఆ సింగర్ తో తన సినిమాలో పాటపాడించుకున్న బన్ని..ఎందుకంటే..!?

సినీ ఇండస్ట్రీలో బోలెడు మంది సింగర్స్ ఉన్నారు. చాలామంది తమ గాత్రంతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. కాగా వాళ్ళల్లో అందరికీ నచ్చిన ఫేవరెట్ సింగర్ సిద్ధ్ శ్రీరామ్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తనదైన స్టైల్ లో పాటలు పాడుతూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ సింగర్ . ఇతనంటే సామాన్య ప్రజలకే కాదు బిగ్ స్టార్స్ కూడా ఇష్టమే అందులో ఒకరే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

అల్లు అర్జున్ కెరీర్ లోనే ఫస్ట్ టైం పాన్ ఇండియా రేంజ్ లో తెరకేక్కిన మూవీ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ రోల్ లో అదరగొట్టేశారు. అంతేకాదు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ సినిమాలో అన్ని పాటలు అద్భుతంగా ఉన్నాయి. సినిమాకి సంగీత దర్శకుడుగా వ్యవహరించిన దేవి శ్రీ ప్రసాద్ బన్నీ ఇమేజ్ ని గుర్తు పెట్టుకొని అభిమానుల కోసం మంచి మాస్ బీట్ మెలోడియస్ సాంగ్ ఐటెం సాంగ్ అన్ని కరెక్ట్ గా రాశాడు.

బన్నీకి సినిమాలో బాగా నచ్చిన సాంగ్ శ్రీవల్లి. నిజానికి ఈ పాటని వేరే సింగర్ తో పాడించాలి అనుకున్నారట. కానీ బన్నీ పట్టుబట్టి మరి సిద్ధ్ శ్రీరామ్. అయితే ఈ పాటకి చాలా బాగుంటుంది అని స్పెషల్ రిక్వెస్ట్ చేసే బన్నీ నే స్వయంగా కాల్ చేసి మరి పాట అడిగి పాడించుకున్నారట. అప్పట్లో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది. అంతేకాదు ఈ పాట సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి ఈ పాటని కాలర్ ట్యూన్ గా పెట్టుకొని..హెడ్ ఫోన్స్ లో పెట్టుకుని జనాలు వింటూనే ఉన్నారు. అంత మంచి వాయిస్ ఆయనది. ఆయన పాడుతుంటే లోకాన్ని మర్చిపోతాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news