Moviesవారెవ్వా: అభిమానులకు మెగా హీరో షాకింగ్ సర్ప్రైజ్..కాలర్ ఎగరేయ్యండి రా అబ్బాయిలు..!!

వారెవ్వా: అభిమానులకు మెగా హీరో షాకింగ్ సర్ప్రైజ్..కాలర్ ఎగరేయ్యండి రా అబ్బాయిలు..!!

మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకి మెగాస్టార్ కొడుకే అయిన నటనలో మాట్రం ఖచ్చితంగా తంFడ్రిని మించిపోయే తనయుడు అవుతాడు. ఇప్పటికే తండ్రికన్నా ఎక్కువుగా పారితోషకం తీసుకుంటూ..టాప్ హీరోల లిస్ట్ లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న విష‌యం అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అ సినిమా తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత “ఆచార్య” సినిమా తో డిజాస్టర్ అందుకున్నా .. ఆయన రేంజ్ మాత్రం తగ్గలేదు.

అయ‌న‌ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. #RC15 అనే వ‌ర్కింగ్‌టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతుంది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నాడు. సినిమా మొదలైనప్పటి నుండి లీకులతో అల్లాడిపోతున్న ఈ చిత్రం మీడియా లో ఎప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది.


తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది.ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఇవ్వట్లేదని గుర్రుగా ఉన్న అభిమానులకు ట్రీపుల్ ధమాకా గిఫ్ట్లు రెడీ చేసిన్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఒక మోషన్ పోస్టర్ ని దుబాయ్ లో లాంచ్ చేయనున్నారట RC15 టీం. ఇప్పటి వరకు ఏ సినిమాకి చేయని విధంగా కళ్లు చెదిరే బడ్జెట్ తో ఓ గొప్ప మెగా ఈవెంట్ గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ ఈవెంట్ ల‌కు చీఫ్ గెస్ట్ లుగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రాకింగ్ స్టార్ యాష్‌ల‌ను పిలుస్తున్నట్లు సమాచారం. ఒక్కవేళ అదే నిజమైతే..అభిమానుల రచ్చకు ఇక హద్దులు ఉండవు. మరి చూడాలి దీని పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో..!?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news