Movies"ఇక నాకు ఆ అవసరం లేదు"..బేబమ్మ బోల్డ్ డెసీషన్ వింటే మైండ్...

“ఇక నాకు ఆ అవసరం లేదు”..బేబమ్మ బోల్డ్ డెసీషన్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

కన్నడ బ్యూటి కృతి శెట్టి ఇప్పుడు ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. టాలీవుడ్ , కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ..ఫుల్ స్వింగ్ మీద ఉంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మా..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తరువాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్న కృతి శెట్టి..వరుస హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఒక్క హిట్ పడితేనే మన వాళ్లు ఊరుకోరు..అలాంటిది వరుసగా మూడు హిట్లు కొట్టేసరికి కృతిని నెత్తిన పెట్టేసుకున్నారు.

ఈ క్రమంలోనే కోలీవుడ్ లో కూడా ఆఫర్లు అందుకుంది. ప్రజెంట్ నితిన్ హీరో గా చేస్తున్న మాచర్ల నియోజకవరగం సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు..త్వరలోనే ధియేటర్స్ లో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కృతి..ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యులో పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఇదే క్రమంలో బాలీవుడ్ లో తనకు ఆఫర్స్ వచ్చాయని ..కానీ అవి వదులుకున్నట్లు చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ..” శ్యామ్‌ సింగరాయ్‌, బంగార్రాజు సినిమాలకు గాను నాకు బాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది. కానీ నేను రిజెక్ట్ చేసా. నాకు ఇష్టం లేదు. నాకు ఏం కావాలో టాలీవుడ్ ఇచ్చింది. అందుకే బాలీవుడ్ వెళ్లాల్సిన అవసరం నాకు లేదు”..అంటూ కృతి తన బాలీవుడ్ సినిమాల ఆఫర్ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతీ ఆశలన్ని మాచేర్ల నియోజకవర్గం చిత్రంపైనే పెట్టుకుంది. ఆగస్ట్ 12న ఈ మూవీ రిలీజ్‌కు రెడీ గా ఉంది. మరి చూడాలి ఈ సినిమా ద్వార కృతి ఎలాంటి విజయాని అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news