Moviesనరేష్ ఫ్యామిలీలో ఓ చావు వార్త.. ఆ తరువాతనే డివర్స్.. వేణు...

నరేష్ ఫ్యామిలీలో ఓ చావు వార్త.. ఆ తరువాతనే డివర్స్.. వేణు స్వామి సెన్సేషనల్ కామెంట్స్..!!

యస్.. ఇప్పుడు జోతిష్యుడు వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. గత కొన్ని రోజులు గా టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్ గురించి ఎలాంటి మాటలు వినిపిస్తున్నాయో మనకు తెలిసిందే. ఆయన నాలుగో పెళ్ళి చేసుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కాదు కాదు మేము పెళ్లి చేసుకోవట్లేదు..ఓన్లీ లివింగ్ రిలేషన్ షిప్ లోనే ఉన్నాము అంటూ మరో బిగ్ బాంబ్ పేల్చారు..నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్.

దీంతో మ్యాటర్ లోకి ఎంటర్ అయిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి..నరేష్ ని చెప్పుతో కొట్టే ప్రయత్నం చేసింది. మరో పక్క, పవిత్ర లోకేష్..ఓ వీడియో రిలీజ్ చేస్తూ..” నాకు, నరేష్ కి మీ సపోర్ట్..కావాలంటూ” అఫిషీయల్ గా వాళ్ళ బంధం పై ప్రకటన చేఇసంది. ఇన్ని తలనొప్పుల మధ్య ఇప్పుడు జోతిష్యుడు వేణు స్వామి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

వేణు స్వామి మాట్లాడుతూ ” సూపర్ స్టార్ కృష్ణ‌గారు నా ఫేవ‌రేట్ హీరో. నేను ఆయనకు ఓ పెద్ద అభిమానిని. ఈ విషయం ఆయనకి తెలుసు. నేను కృష్ణ‌గారింట్లో పూజ‌లు , హోమాలు వేసేవాడిని. నేను రెగ్యుల‌ర్ వారింట్లో పూజ‌లు చేస్తుంటాను. ఆ టైంలో నే వాళ్ళకు జాత‌కాలు కూడా చెప్పేవాడిని. అది 2014 స‌మ‌యంలో అనుకుంటాను.. ఓ రోజు కృష్ణ‌, విజ‌య నిర్మ‌ల‌గారి జాత‌కాలు చూసి..మీ ఇద్దరి లో ఒకరు చనిపోబోతున్నారు..అది కూడా 2020లో అని ముందే చెప్పాను.

దీంతో నిర్మలమ్మ భయపడిపోయారు. అంతేకాదు, అప్పుడే రమ్య రఘుపతి, నరేష్ పెళ్ళి గురించి కూడా చెప్పాను..వాళ్ళ జాతకాలు కలవలేదు..వద్దు చేయకండి అని..కానీ, వాళ్లు వినలేదు. అప్పుడే చెప్పాను , మీరు పెళ్ళి చేసుకున్న ..డివర్స్ వరకు వెళ్తుందని..ఇప్పుడు అదే జరిగింది. నాకు తెలుసు ఈ విషయాలు వాళ్ళ పరసనల్స్ అని. కానీ, జాతకాలు కలవకుండా పెళ్లి చేసుకుంటే..ఇలాగే అవుతుందని..చెప్పడానికి ఈ విషయం చెప్పాను ” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..వేణు స్వామి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news