Moviesఆ స్టార్ హీరో , డైరెక్ట‌ర్ కొడుకుతో ఎఫైర్ వార్త‌ల‌తో ఇబ్బంది...

ఆ స్టార్ హీరో , డైరెక్ట‌ర్ కొడుకుతో ఎఫైర్ వార్త‌ల‌తో ఇబ్బంది ప‌డ్డ అనుష్క‌…!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి అందరికీ తెలిసిందే. మొదటి సినిమా సమయంలో ఎంత అమాయకంగా ఉందో ..ఇప్పటివరకు అదే మేయింటైన్ చేస్తున్నారు. సూపర్ సినిమాలో చిన్న చిన్న డ్రసులు వేసుకోవాల్సి రావడంతో ఈ ఒక్క సినిమా చేసి వెళ్ళిపోదామనుకుంది అనుష్క. ఎందుకంటే ఆమె యోగా టీచ‌ర్‌. ఈ సినిమా, గ్లామ‌ర్ ఫీల్డ్ త‌న‌కు ఎందుకు అనుకునేది. కానీ, ఆ సినిమా సక్సెస్ చూసి, జనాల ఆదరణ చూసి ఇక ఇక్కడే నా లైఫ్ ని ఫిక్సైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా మీడియం రేంజ్ నుంచి భారీ చిత్రాల వరకు దాదాపు అందరు హీరోల సరసన నటించింది.

ఇక అరుంధతి సినిమా అనుష్క కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ మూవీ. అనుష్క సినీ కెరీర్ గురించి ప్రస్తావన వస్తే ఖచ్చితంగా ఈ సినిమాకి ముందు ఆ తర్వాత అని చర్చించుకుంటారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు అనుష్క కేరాఫ్ అడ్రస్‌గా మారిందీ అంటే అది అరుంధతి వల్లే. ఇండస్ట్రీలో చాలా మృదు స్వభావం కలిగిన హీరోయిన్స్‌లో మొదటి నిలిచేది అనుష్కనే అని చెప్పక తప్పదు. మిగతా ఏ విషయాలలోనూ కాంట్రవర్సీ కాకపోయినప్పటికీ ఇద్దరు విషయంలో మాత్రం అనుష్క పేరును సోషల్ మీడియాలో వేసి నలిపేసి రచ్చ చేశారు.

ఒకటి గ్లోబల్ స్టార్ ప్రభాస్..రెండు దర్శకుడు ప్రకాష్ కోవెల మూడి. ప్రభాస్ – అనుష్క శెట్టి పెళ్లి గురించి ఇప్పటికే లెక్కలేనన్నీ వార్తలు వచ్చాయి. వీరిద్దరికీ ఇంకా పెళ్లి కాకపోవడంతోనే ఈ వార్తలకు ఎప్పటికప్పుడు బల చేకూరుతోంది. అయితే, ఎప్పుడు వీరి పెళ్లి గురించి అటు ప్రభాస్ ని గానీ, ఇటు అనుష్కను గానీ అడిగితే వచ్చిన సమాధానం ఏమీ లేదనే. అలాగే, దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు కొడుకు దర్శకుడు ప్రకాష్ కోవెల మూడితోనూ అనుష్కకి ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. సైజ్ జీరో సినిమా నుంచి వీరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే, ప్రకాష్ కి విడాకులు కావడంతో అనుష్కని పెళ్లి చేసుకుంటాడని టాక్ వినిపిస్తోంది. ఆ త‌ర్వాత అనుష్క సినిమా ఏదీ లేదు గానీ, లేకపోతే ఆమె గురించి రెగ్యులర్‌గా ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. మొత్తానికి అనుష్క అటు ప్రభాస్ ఇటు ప్రకాష్ కోవెల మూడి మధ్య బాగానే నలిగిపోయింది. అలా అనుష్కకి వీరిద్ద‌రితో ఎఫైర్ ఉందని పుకార్లు పుట్టాయి. అయినా అనుష్క ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్ళు పూర్తైన సందర్భంగా చేసిన ఫంస్కన్ లో దర్శకుడు పూరి జగన్నాథ్ బంగారు తల్లి అని చెప్పడం ఆసక్తికరం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news