Moviesప్రభాస్ పాటను రీమేక్ చేస్తున్న విజయ్..ఏం క్రేజ్ రా బాబు..!!

ప్రభాస్ పాటను రీమేక్ చేస్తున్న విజయ్..ఏం క్రేజ్ రా బాబు..!!

పాన్ ఇండియా హీరో గా పేరు తెచ్చుకున్న ప్రభాస్..ప్రస్తుతం వరుస సినిమాలాతో బిజీ గా ఉన్నాడు. బాహుబలి సినిమా తరువాత తన రేంజ్ ను మార్చేసుకున్న ఈయన..ఇప్పుడు ఒక్కో సినిమా 100 కోట్ల కు పై గా పారితోషకాని పుచ్చుకుంటున్నాడు. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి బాలీవుడ్ బడా స్టార్స్ సైతం ఆశ్చర్య పోతున్నారు.

అయితే, ఇలాంటి స్టార్ క్రేజ్ సంపాదించుకున్న హీరో సినిమా నుండి ఓ పాటను రీమేక్ చేయబోతున్నాడు మరో స్టార్ హీరో విజయ్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్..వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. దిలా రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తో తెలుగులో సెటిల్ అయిపోవాలని భారీ స్కెచ్ వేశాడు విజయ్.

అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో విజయ్ ప్రభాస్ కెరీర్ లో ఫ్లాప్ గా నిలిచిన సినిమా రాఘ‌వేంద్ర నుంచి ఓ పాటను రీమేక్ చేయబోతున్నాడట. ‘క‌ల‌క‌త్తా పానేసినా చూసుకో.. ’అనే సాంగ్‌ను విజయ్ తన సినిమాలో రీమిక్స్ చేయ‌బోతున్నాడంటూ ఓ వార్త తెగ వైరల్ గా మారింది. ఇక్క‌డ మరో ఆశ్చర్య కర విష‌యం ఏమిటంటే..అస్సలు ఈ పాటను ఆ సినిమాలో రీమిక్స్ చేసింది విజయ్ ‘ఆల్ తోట భూప‌తి ..’అనే త‌మిళ సాంగ్‌ నుంచే. యూత్ అనే త‌మిళ చిత్రంలో ఈ స్పెష‌ల్ సాంగ్ హైలెట్ గా నిలిచింది . అప్ప‌ట్లో ఈ పాట ఓ ఊపు ఊపేసింది. మ‌ళ్లీ ఇప్పుడు మ‌రోసారి అదే పాటను విజ‌య్‌..రీమిక్స్ చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news