Moviesఆ రోజు చచ్చి బ్రతికా.. కియారా లైఫ్ లో మోస్ట్ పెయిన్...

ఆ రోజు చచ్చి బ్రతికా.. కియారా లైఫ్ లో మోస్ట్ పెయిన్ ఫుల్ మూమెంట్..!!

కియారా అద్వానీ.. ఈ పేరు ఇప్పుడు తెలుగు, హీందిలో మారు మ్రోగిపోతుంది. కేవలం తన సైలెంట్ లుక్స్ తోనే డైరెక్టర్లను మాయ చేస్తుంది ఈ బ్యూటి. కియారా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్ర‌త్యేకంగా ప‌రిచయం చేయాల్సిన అవ‌స‌రం లేదు. మ‌హేష్ హీరోగా వ‌చ్చిన‌ భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన కియారా.. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ వినయ విధేయ రామ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. కానీ, అమ్మడు ఎందుకో తెలుగులో ఎక్కువ అవకాశాలు దక్కించుకోలేకపోయింది. వినయ విధేయ రామ చిత్రం త‌ర్వాత ఏ తెలుగు సినిమాలోనూ కియారా న‌టించ‌లేదు.

అయితే బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస అవ‌కాశాల‌తో ఛాన్సులు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రీసెంట్ గా వచ్చిన భూల్ భూల్లియా సినిమాలో కూడా అమ్మడు తన దైన స్టైల్ లో మెప్పించింది. పాత్ర చిన్నదే అయినా..ఉన్న కాసేపు..హర్రర్ లుక్స్ లో కాసేపు..అల్లరి అమ్మాయిగా కాసేపు అలరించింది. ఈ సినిమా బాలీవుడ్ లో కొత్త ఆశలు పుట్టించింది జనాలుకు. కాగా, ప్రజెంట్ చరణ్ -శంకర్ కాంబోలో రాబోతున్న సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ అమ్మడు..త్వరలోనే తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ వేసుకోబోతుంది.

ఇక రీసెంట్ గా ఓ మ్యాగ్ జైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో ఆమె మాట్లాడుతూ..తన జీవితంలో చూసిన పెయిన్ ఫుల్ మూమెంట్ గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ..”కాలేజి చదువుతున్న రోజులలో వాళ్ళ బ్యాచ్ తో కలిసి ధర్మశాలలోని మెక్ లియోడ్ గంజ్ కి వెళ్ళిందట. అక్కడ ఓ నాలుగు రోజుల ఉండాల్సి వచ్చిందట.. ఒకవైపు భారీ హిమపాతం.. మరోవైపు మైనస్ డిగ్రీల చలి ఉండడంతో..అక్కడ ఉన్న వారంత.. ఆ చలి నుండి ఉపశమనం పొందడానికి భోగిమంటలు వేసుకున్నారట.

అయితే అవి కూడా త్వరగా ఆరిపోయాయట. ఇక ఆ రోజు రాత్రి పడుకున్న సమయంలో కితారా గదిలో ఉన్నట్లు ఉండి మంటలు చెలరేగాయని..దీంతో ఆమె చాలా భయపడ్డిందని..ఇప్పటి అలా మటలు ఎలా వచ్చాయో కూడా అర్థంకావడం లేదని.. లక్కిగా నా ఫ్రెండ్ మేల్కొని గట్టిగా అరవడంతో,.. అందరం బ్రతికి బయటపడ్డామని..లేకపోతే, చచ్చిపోయి ఉండేవాళ్లమని” చెప్పుకొచ్చింది కియారా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news