Moviesవిడిపోయినా చైతుపై సామ్‌కు కోపం త‌గ్గ‌లేదా.. అస‌లు అంత ప‌గ‌కు కార‌ణం...

విడిపోయినా చైతుపై సామ్‌కు కోపం త‌గ్గ‌లేదా.. అస‌లు అంత ప‌గ‌కు కార‌ణం ఇదే..!

టాలీవుడ్‌లో ఎంతో అన్యోన్యంగా ఉంటార‌నుకున్న జోడీల్లో అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత జోడీ ఒక‌టి. యేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017లో ఒక్క‌ట‌య్యారు. త‌ర్వాత నాలుగేళ్ల‌కు 2021 చివ‌ర్లో విడిపోయారు. విచిత్రం ఏంటంటే వీరు విడిపోవ‌డానికి నాలుగు నెలల ముందు వ‌ర‌కు కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ప‌లు వెకేష‌న్ల‌కు కూడా క‌లిసే వెళ్లారు. అంతా నాలుగు నెల‌ల్లోనూ తారు మారు అయిపోయింది. ముందు నుంచే వీరి మ‌ధ్య గ్యాప్ ఉంద‌న్న సిగ్న‌ల్స్ ఇస్తూ వ‌చ్చింది సామ్‌. చివ‌ర‌కు అంద‌రి అనుమానాలు నిజం చేస్తూ విడిపోయారు.

విడాకుల త‌ర్వాత ఎవ‌రి లైఫ్‌లో వారు బిజీగా ఉన్నారు. అయితే వీరు విడిపోయి 9 నెల‌లు అవుతున్నా కూడా ఎప్పుడూ ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీ వార్త‌ల‌తోనే స‌మంత చైతును ప‌రోక్షంగా టార్గెట్ చేస్తోంద‌న్న చ‌ర్చ‌లు అయితే ఆగ‌డం లేదు. తాజాగా చైతు – శోభిత ధూళిపాళ‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ వ‌చ్చిన వార్త‌ల వెన‌క కూడా సామ్ పీఆర్ టీం ఉందంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌ర‌గ‌డం.. దానిని స‌మంత మేం బాగానే ఉన్నాం.. మీరు మీ ప‌నులు చేసుకోమ‌ని కౌంట‌ర్ ఇవ్వ‌డం జ‌రిగాయి.

విడిపోయాక సామ్ చైతును డైరెక్టుగా టార్గెట్ చేయ‌క‌పోయినా ఏదోలా చైతునో లేదా నాగార్జున ఫ్యామిలీనో టార్గెట్ చేస్తూనే ఉన్న‌ట్టుగా పోస్టులు పెడుతూ వ‌స్తోంది. సోష‌ల్ మీడియాలో త‌న‌ను టార్గెట్ చేసే వాళ్ల‌కు కూడా ఆమె ఘాటుగానే కౌంట‌ర్లు ఇస్తూ వ‌స్తోంది. అస‌లు విడిపోయి ఎవ‌రి దారుల్లో వాళ్లు ఉన్న‌ప్పుడు కూడా సామ్‌కు చైతు, అక్కినేని ఫ్యామిలీపై ఇంత కోపం ఎందుకు ? వాళ్ల‌నే వ‌ద‌ల‌కుండా ఎందుకు వెంట‌ప‌డుతోంద‌న్న‌దానిపై కూడా ఇండ‌స్ట్రీ జ‌నాల్లో చాలా సందేహాలే ఉన్నాయి.

విడిపోయాక కూడా సోష‌ల్ మీడియా, అక్కినేని అభిమానుల నుంచి స‌మంత‌పై ఎన్నో నెగిటివ్ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. వీటిపై చైతు నుంచి ఎలాంటి ఖండ‌న లేక‌పోవ‌డంతో స‌మంత మ‌రింత అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. చైతుపై వ‌స్తోన్న వార్త‌ల‌కు స‌మంత పీఆర్ టీంకు లింకులు ఉన్నాయ‌న్న పుకార్ల‌ను కూడా ఎవ‌రు ? ఎందుకు వ్యాపింప‌జేస్తున్నార‌ని కూడా స‌మంత ఆగ్ర‌హంతో ఉంద‌ట‌.

విడాకుల త‌ర్వాత సోష‌ల్ మీడియాలో స‌మంత టార్గెట్ అయ్యింది. చైతును ఎవ్వ‌రూ త‌ప్ప‌ప‌ట్ట‌లేదు. పైగా చైతుపై చాలా మంది న్యూట్ర‌ల్ నెటిజ‌న్ల‌లో కూడా సాఫ్ట్ కార్న‌ర్ మ‌రింత పెరిగింది. తాజాగా చైతుకు, శోభిత‌కు లింక్ ఉంద‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్పుడు తాను మీ ప‌ని మీరు చేసుకోమ‌ని ఖండ‌న ఇచ్చాన‌ని.. త‌న‌పై నెగిటివ్ వార్త‌లు వ‌చ్చిన‌ప్పుడు చైతు వైపు ఎందుకు ఖండ‌న రాలేద‌ని కూడా సామ్ కోపంతో ఉంద‌ట‌. అందుకే ఇలా సోష‌ల్ మీడియాలో త‌న కోపం, ఆక్రోశం వెల్ల‌గ‌క్కుతోంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news